తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చిన్న పార్టీలతో మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక బుధవారం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్షను నిరూపించుకోనున్నారు. ఇప్పటికే విజయ్కు 120 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యేను ఫ్లోర్ టెస్ట్లో పాల్గొనవద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో విజయ్ బలం 119కు చేరింది. అయినా కూడా మ్యాజిక్ ఫిగర్కు కంటే ఎక్కువగానే విజయ్ మెజార్టీ ఉంది.
ఇదిలా ఉంటే మంగళవారం తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. ఏఐఏడీఎంకేలో భారీ చీలిక జరిగింది. పళనిస్వామికి వ్యతిరేకంగా దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. సీనియర్ నేత షణుగ్మం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు తెల్పుతున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న షణుగ్మం, ఎస్.పి. వేలుమణిలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. రేపటి ఫ్లోర్ టెస్ట్పై చర్చిస్తున్నారు. 30 మంది ఎమ్మెల్యేలు బహిరంగం టీవీకే మద్దతు తెల్పడంతో అన్నాడీఎంకేలో కలహాలు చెలరేగాయి. ఇర విజయ్ బలం 150కు పైగా పెరిగింది. ఇక తిరుగులేని శక్తిగా టీవీకే నిలవబోతుంది. ఇక తమ పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ను ఏఎంఎంకే నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ వెల్లడించారు.
