Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- తమిళనాడులో రాజకీయ అనిశ్చితి
- కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను పిలవని గవర్నర్
- గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం
- రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ నిరాకరించారు. మ్యాజిక్ ఫిగర్ చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరుకు నిరసనగా శుక్రవారం లోక్భవన్ ఎదుట, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. తమిళనాడు గవర్నర్, బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. బల నిరూపణ అనేది విజయ్ అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటారని.. ముందే ఎలాంటి నిరూపించుకుంటారని కాంగ్రెస్ నిలదీసింది.
Also Read
సోమవారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్లలో దూరంలో ఉంది. అయితే విజయ్కు కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో 113 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు విజయ్ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కానీ గవర్నర్ మాత్రం ససేమిరా అన్నారు. పూర్తి ఫిగర్ చూపిస్తేనే ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!