Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Taliban Foreign Minister To Visit India First High Level Talks Since 2021

Taliban: భారత్‌కు తాలిబాన్ మంత్రి.. పాకిస్తాన్‌‌కు రుచించని పరిణామం..

Published Date :October 3, 2025 , 10:51 am
By Venu Goapl Reddy
  • భారత్‌కు తాలిబాన్ మంత్రి..
  • రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం..
  • పాకిస్తాన్‌‌కు రుచించని పరిణామం..
Taliban: భారత్‌కు తాలిబాన్ మంత్రి.. పాకిస్తాన్‌‌కు రుచించని పరిణామం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Taliban: ఆఫ్ఘనిస్తాన్ లో 2021లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశానికి చెందిన మంత్రి భారత్‌లో పర్యటించేందుకు వస్తున్నారు. విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 09న భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పరిణామం ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతోంది. ఐక్యరాజ్యసమితి ప్రయాణ ఆంక్షల జాబితాలో ఉన్న ముత్తాకికి, భారత పర్యటన కోసం అనుమతి లభించింది. దీంతో అక్టోబర్ 09-16 మధ్య ఆయన దేశంలో పర్యటించనున్నారు.

జనవరి నుంచే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జేపీ సింగ్‌లతో సహా ఇతర ఉన్నతాధికారులు ముత్తాకితో పాటు సీనియర్ తాలిబాన్ నాయకులతో అనేక రౌండ్ల చర్చలు జరిపారు. నిజానికి, తాలిబాన్‌ పరిపాలనను భారత్ అధికారికంగా గుర్తించకపోయినప్పటికీ, ఇరు దేశాలు మాత్రం సంబంధాలను కొనసాగించాయి. తరుచుగా దుబాయ్ వేదికగా భారత్-తాలిబాన్ అధికారులు సమావేశమయ్యే వారు.

Also Read

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
  • PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం

Read Also: Abhishek Sharma: రాసి పెట్టుకో.. భారత జట్టుకు నువ్వు మ్యాచ్‌లు గెలిపించడానికి నిన్ను సిద్ధం చేస్తున్నా

భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేసిన సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముత్తాకితో ఫోన్‌లో మాట్లాడారు. పహల్గామ్ దాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. పాకిస్తాన్‌‌ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని మండిపడింది. తాలిబాన్లు ఉగ్రదాడిని ఖండించిన తర్వాత, భారతదేశం ఆఫ్ఘన్ ప్రజలతో స్నేహాన్ని పునరుద్ఘాటించింది. ఇక ఆప్ఘన్ కు భారత్ మానవతా సాయాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల, భూకంప సమయంలో 1000 గుడారాలను, 15 టన్నుల సామాగ్రిని భారత్ పంపించింది. సంక్షోభ సమయాల్లో ఆఫ్ఘన్ ప్రజలకు అండగా నిలుస్తోంది. 2021లో భారత్ దాదాపుగా 50,000 టన్నుల గోధుమల్ని, 330 టన్నుల మందులు, వాక్సిన్లు, 40,000 లీటర్ల పరుగు మందుల్ని పంపించింది.

భారత్, ఆఫ్ఘన్ దగ్గర అవుతుండటం పాకిస్తాన్‌లో భయాన్ని పెంచుతోంది. ఇప్పటికే పాక్, ఆఫ్ఘన్‌ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్యూరాండ్ లైన్ సరిహద్దుపై ఇరు దేశాల మధ్య ఘర్షణ ఉంది. తమ ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో పాకిస్తాన్ తాలిబాన్లను, ఆప్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. అయితే, ఈ దాడులు చేస్తోంది తమ దేశంలో ఉంటున్న ఆఫ్ఘన్ జాతీయులను పాక్ ఆరోపిస్తోంది. భారత్ తమతో ఉంటే ప్రతీ విషయానికి పాకిస్తాన్‌పై ఆధారపడటం తగ్గుతుందని తాలిబాన్లు భావిస్తు్న్నారు. ఆప్ఘనిస్తాన్‌లో భారత్ ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ ప్రాంతంలో చైనా, పాకిస్తాన్ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ముత్తాకి పర్యటన ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afghanistan humanitarian aid
  • Amir Khan Muttaqi
  • India Operation Sindoor
  • India Taliban engagement
  • India-Afghanistan Relations

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions