Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న స్వరాభాస్కర్
Swara Bhasker joins Bharat Jodo, walks with Rahul Gandhi in Ujjain: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రం ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ పాదయాత్రతో కన్యాకుమారిలో ప్రారంభం అయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల్లో ముగిసిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ చేరింది. ఇదిలా ఉంటే గురువారం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేరారు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.
Read Also: MLC Kavitha: మోడీ వచ్చే ముందు ED రావడం సహజం.. జైల్లో పెడతాం అంటే బయపడం!
Also Read
- Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
- Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ తిరస్కరణ
- Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా
గురువారం ఉజ్జయినిలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు స్వరాభాస్కర్. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుల రాహుల్ గాంధీకి మద్దతుగా భారత్ జోడోయాత్రలో పాల్గొన్నారు. పూజా భట్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్, రియా సేన్, అమోల్ పాలేకర్లు పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు. బీజేపీని విపరీతంగా ద్వేషించే స్వరా భాస్కర్, జోడో యాత్రలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బాలీవుడ్ ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొనడాన్ని బీజేపీ ‘ గెస్ట్ రోల్’గా విమర్శించింది. పెయిడ్ యాక్టర్లు యాత్రలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది.
కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు, బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు భారత్ జోడో యాత్ర ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా మొత్తం 3570 కిలోమీటర్ల మేర ఐదు నెలల పాటు కొనసాగనుంది. కాశ్మీర్ తో చేరడంతో యాత్ర ముగుస్తుంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర 83వ రోజుకు చేరుకుంది. మొత్తం 7 రాష్ట్రాల్లో 36 జిల్లాల్లో 1209 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ.
आज प्रसिद्ध अभिनेत्री @ReallySwara #BharatJodoYatra का हिस्सा बनी।
समाज के हर वर्ग की उपस्थिति ने इस यात्रा को सफल बना दिया है। pic.twitter.com/Ww5lEZnDys
— Congress (@INCIndia) December 1, 2022
తాజావార్తలు
-
Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
-
Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
-
Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
ట్రెండింగ్
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!