West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- కాలేజీ గదిలో దాదాపు రూ.1 కోటి నగదు
- రివాల్వర్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు గుర్తింపు
- కోల్కతా సురేంద్రనాథ్ కాలేజీలో ఘటన
- టీఎంసీ అరాచకాలపై బీజేపీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు వేడెక్కతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(సంక్షోభం) దిశగా వెళ్తోంది. ఇదిలా ఉంటే, మరో రాజకీయ దుమారం చెలరేగింది. కోల్కతాలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన సురేంద్రనాథ్ కళాశాల ఒక పెద్ద వివాదానికి కేంద్రంగా నిలిచింది. కాలేజీలోని విద్యార్థి సంఘం గదిలో కోటి రూపాయల నగదు, రెండు ఏసీ బెడ్రూంలు, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ దొరకడం సంచలనంగా మారింది. దీంతో బీజేపీ, టీఎంసీపై తీవ్ర ఆరోపణలు చేసింది.
విద్యా్ర్థి సంఘం ఎన్నికలు జరగకపోవడం వల్ల కాలేజీలోని విద్యార్థి సంఘం హాళ్లను మూసేయాలని 2025లో కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఏడాది తర్వాత స్టూడెంట్ యూనియన్ గదిని తెరిచారు. దక్షిణ కోల్కతా లా కాలేజీలో విద్యార్థినిపై స్టూడెంట్ యూనియన్ గదిలో అత్యాచారం జరిగిన తర్వాత కోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. అయితే, ఇటీవల బీజేపీ సర్కార్ కాలేజీ విద్యార్థి సంఘ నిధుల ఖర్చులపై ఆడిట్కు ఆదేశించింది. దీంతో కాలేజీ యాజమాన్యం మంగళవారం స్టూడెంట్ యూనియన్ గదిని శుభ్రపరిచే సమయంలో ఈ వస్తువులు వెలుగులోకి వచ్చాయి.
Also Read
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
గదిలోని అల్మారాలో చెదలు పట్టిన స్థితిలో 100, 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ డబ్బు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీ అడ్మిషన్ల సమయంలో జరిగిన అవకతవకలు, అక్రమ వసూళ్లతో ఈ డబ్బుకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ గదుల్లో ఏసీలు, అటాచ్డ్ టాయిలెట్స్, ఖరీదైన పరుపులు ఉన్నాయి. గతంలో తృణమూల్ సర్కార్ లోని కొంతమంది రాజకీయ నాయకులు ఈ గదుల్ని ఉపయోగించేవారని కాలేజీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఈడీతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్లోని పలు కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
-
Sukhbir Singh Badal: నాందేడ్లో సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!