West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- కాలేజీ గదిలో దాదాపు రూ.1 కోటి నగదు
- రివాల్వర్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు గుర్తింపు
- కోల్కతా సురేంద్రనాథ్ కాలేజీలో ఘటన
- టీఎంసీ అరాచకాలపై బీజేపీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు వేడెక్కతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(సంక్షోభం) దిశగా వెళ్తోంది. ఇదిలా ఉంటే, మరో రాజకీయ దుమారం చెలరేగింది. కోల్కతాలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన సురేంద్రనాథ్ కళాశాల ఒక పెద్ద వివాదానికి కేంద్రంగా నిలిచింది. కాలేజీలోని విద్యార్థి సంఘం గదిలో కోటి రూపాయల నగదు, రెండు ఏసీ బెడ్రూంలు, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ దొరకడం సంచలనంగా మారింది. దీంతో బీజేపీ, టీఎంసీపై తీవ్ర ఆరోపణలు చేసింది.
విద్యా్ర్థి సంఘం ఎన్నికలు జరగకపోవడం వల్ల కాలేజీలోని విద్యార్థి సంఘం హాళ్లను మూసేయాలని 2025లో కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఏడాది తర్వాత స్టూడెంట్ యూనియన్ గదిని తెరిచారు. దక్షిణ కోల్కతా లా కాలేజీలో విద్యార్థినిపై స్టూడెంట్ యూనియన్ గదిలో అత్యాచారం జరిగిన తర్వాత కోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. అయితే, ఇటీవల బీజేపీ సర్కార్ కాలేజీ విద్యార్థి సంఘ నిధుల ఖర్చులపై ఆడిట్కు ఆదేశించింది. దీంతో కాలేజీ యాజమాన్యం మంగళవారం స్టూడెంట్ యూనియన్ గదిని శుభ్రపరిచే సమయంలో ఈ వస్తువులు వెలుగులోకి వచ్చాయి.
Also Read
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
- Insurance Murder Case : రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్తని చంపింది.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు!
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
గదిలోని అల్మారాలో చెదలు పట్టిన స్థితిలో 100, 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ డబ్బు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీ అడ్మిషన్ల సమయంలో జరిగిన అవకతవకలు, అక్రమ వసూళ్లతో ఈ డబ్బుకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ గదుల్లో ఏసీలు, అటాచ్డ్ టాయిలెట్స్, ఖరీదైన పరుపులు ఉన్నాయి. గతంలో తృణమూల్ సర్కార్ లోని కొంతమంది రాజకీయ నాయకులు ఈ గదుల్ని ఉపయోగించేవారని కాలేజీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఈడీతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్లోని పలు కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?