Supreme Court: నేతాజీని జాతీయ పుత్రుడిగా ప్రకటించలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
- నేతాజీని జాతీయ పుత్రుడిగా ప్రకటించలేం
- అధికార యంత్రాంగాన్ని సంప్రదించండి
- పనికిమాలిన పిటిషన్లు వేయొద్దన్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ను జాతీయ పుత్రుడిగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) వల్లే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. ఈ నేపథ్యంలో నేతాజీని ‘‘జాతీయ పుత్రుడిగా’’ ప్రకటించాలని, అలాగే 21 అక్టోబర్ 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపన, 23 జనవరి 1897 ( చంద్రబోస్ జయంతి)లను జాతీయ దినాలుగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారించింది. ఈ సందర్భంగా సూర్యకాంత్ మాట్లాడుతూ.. గతంలోనూ ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యాయని.. అయినా ఇటువంటి విషయాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని.. సంబంధిత అధికార యంత్రాంగంతో చర్చించాలని పిటిషన్ను కొట్టేసిందని గుర్తుచేశారు. తాజా పిటిషన్ కూడా అలాంటిదేనని కొట్టేశారు.
Also Read
- Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్డేట్.. పిల్లల గుర్తింపుకు సంబంధించిన ఈ సేవ ఆ తేదీ వరకు ఫ్రీ..!
- Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్లు..!
- Ayodhya Ram Mandir Trust: నేటి అయోధ్య ట్రస్ట్ భేటీపై ఉత్కంఠ.. ఐదు ప్రధాన అజెండాలు
- Mumbai Heavy Rains: దంచికొట్టిన వాన.. 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం.. నేడు స్కూల్స్ కు సెలవు..!
కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని.. తిరిగి ఇదే పిటిషన్ రావడం పట్ల న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై భవిష్యత్లో కూడా ఇలాంటి పనికిమాలిన పిటిషన్లు దాఖలు చేయొద్దని పిటిషనర్కు సీజేఐ గట్టి వార్నింగ్ ఇచ్చారు. లేదంటే జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా ఇకపై ఇలాంటి పిటిషన్లు స్వీకరించవద్దని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇప్పుడు కోర్టు హాల్ నుంచి వెళ్లిపోవాలని.. లేకుంటే ఖర్చులు విధించాల్సి ఉంటుందని పిటిషనర్ను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు.
The Supreme Court has dismissed a public interest litigation seeking a declaration that freedom fighter Netaji Subhash Chandra Bose’s Indian National Army (INA) secured India’s independence, along with a request to declare Netaji as the “National Son” and to observe 21 October… pic.twitter.com/ktYgMeHJFE
— ANI (@ANI) April 20, 2026
తాజావార్తలు
-
Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
-
Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
-
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
-
Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
-
Vivo Y500: వివో Y500 విడుదల.. 50MP కెమెరా, 8100mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో కొత్త స్మార్ట్ఫోన్
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!