Bhojshala Case: మధ్యప్రదేశ్లోని భోజ్శాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రోజున భోజ్శాల ప్రాంగణంలో నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్న ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు వారికి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య నమాజ్ చేసుకునేందుకు భోజ్శాల సమీపంలో ఓ బహిరంగ ప్రదేశాన్ని అందుబాటులో ఉంచాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు సున్నితమైంది కావడంతో హిందూ, మస్లిం పక్షాలు సహనం పాటించాలని సూచించింది. అయితే, ఈ సమస్యపై రోజూవారీ విచారణ నిర్వహించి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
మే నెలలో మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్శాల దేవాలయమే అంటూ సంచలన తీర్పు చెప్పింది. దశాబ్ధాలుగా ఉన్న వివాదానికి చెక్ పెట్టింది. అయితే, హైకోర్టు దేశాలను సవాల్ చేస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఇచ్చిన శుక్రవారం నమాజ్ అనుమతిని రద్దు చేుసింది. తాజాగా సుప్రీం తీర్పులో, కోర్టు అనుమతి లేకుండా భోజ్శాల ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణ పనులు, మార్పులు చేయకూడదని ఏఎస్ఐని ఆదేశించింది.

