Supreme Court: రామ మందిర విరాళాల చోరీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- రామ మందిర విరాళాల కేసులో కొత్త SIT ఏర్పాటు
- చార్టర్డ్ అకౌంటెంట్ను సభ్యుడిగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
- ఐజీ కిరణ్ ఎస్. నేతృత్వంలో దర్యాప్తు
- రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తన వాదనల్ని వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పారదర్శకమైన దర్యాప్తు జరిగేలా చూసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలియజేశారు.
ఇదిలా ఉంటే, సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్లో అనుభవం ఉన్న చార్టర్ట్ అకౌంటెంట్ను సభ్యులుగా చేర్చిన కొత్త సిట్ ఏర్పాటు చేయాలని యూపీ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్త సిట్కు లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్. నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా అయోధ్య రేంజ్ డీఐజీ సోమెన్ బర్మా, అయోధ్య ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ ఉన్నారు. కోర్టు సూచన మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణుడైన చార్టర్డ్ అకౌంటెంట్ను కూడా సిట్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
Also Read
- Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
- Energy Crisis: భారత్లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? నిపుణుల ఆందోళన ఎందుకు?
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు కీలక పదవి? పార్లమెంట్ దగ్గర కాంగ్రెస్ నేతతో ఆసక్తికర సంభాషణ
- CJP: కాక్రోచ్ల సంబరాలకు డబ్బు ఎక్కడిది.? మహేష్ జెఠ్మలానీ అనుమానాలు..
నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉన్నందున ఆర్థిక అంశాలను పరిశీలించేందుకు నిపుణులు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా పిటిషన్ల తరుపు న్యాయవాది, ఆలయానికి వచ్చే నిధులు, విరాళాల వివరాలను ట్రస్ట్ వెబ్ సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. అయితే, ఈ అంశాన్ని అనవసరంగా సంచలనంగా మార్చొద్దని సొలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తుపై రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Supreme Court: రామ మందిర విరాళాల చోరీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Ajay Bhupathi: ‘శ్రీనివాస మంగాపురం’లో ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మొదటి నుంచి ఆయనే అనుకున్నా..
-
TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
-
Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
-
Rain Alert : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 3 గంటల్లో వర్షం, 40 కిమీ వేగంతో ఈదురుగాలులు.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!