NTV Telugu Site icon

Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు ప్రత్యక్ష ప్రసారం..

Sc

Sc

Supreme Court: భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు పడింది. సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్ లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రకటించింది. కొత్తగా రూపొందించిన సాప్ట్ వేర్ తో ఈ ప్రయోగాత్మక పరిశీలన చేయబోతున్నట్లు తెలిపింది. లోటుపాట్లు సవరించి.. త్వరలోనే అధికారికంగా సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్ లలో జరిగే వాదనలు, తీర్పులు ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొనిందిద. అయితే, ఇవాళ ఒక టెస్ట్ ఫార్మాట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయగా.. యూట్యూబ్ ఛానెల్ కు బదులుగా కోర్టుకు చెందిన సొంత అప్లికేషన్ పై లైవ్ ప్రసారం చేశారు.

Read Also: Robbery: రైతు ఇంట్లో కోటి రూపాయల దొంగతనం.. నిందితులను పట్టించిన పోలీస్ డాగ్

అయితే, 2022 నుంచి రాజ్యాంగ ధర్మాసనం ప్రజా ప్రాముఖ్యత కలిగిన కేసు వాదనలు, తీర్పులను మాత్రమే ప్రజలు వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించిన తొలి రోజు 8 లక్షల మంది చూశారు. ఇటీవల నీట్-యూజీ విషయంలో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారణలు, ఆర్జీ కర్ హస్పటల్ లో జూనియర్ డాక్టర్ హత్యకు సంబంధించి సుమోటోగా స్వీకరించిన కేసును కూడా ప్రజా ప్రయోజనాల పరిగణనలోకి తీసుకుని ప్రత్యక్ష ప్రసారం చేసింది.