Supreme Court: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని సీఎస్పై ఫైర్..
Supreme Court: పశ్చిమ బెంగాల్ మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా బెంగాల్ అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేుసింది. ఈ ఘటన విచారణ సందర్భంగా కోర్టు బెంగాల్ సీఎస్ను నేరుగా ప్రశ్నిస్తూ.. ‘‘మీరు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు..? మీరు అంత గొప్పవారని అనుకోకండి, మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకోకండి’’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో ఒక మహిళా న్యాయమూర్తిని అడ్డుకోవడం, బెదిరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా జడ్జి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోర్టు సీరియస్గా వ్యవహరించింది.
ఎన్ఐఏ ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. విచారణకు సంబంధించిన విషయాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో న్యాయాధికారులను అడ్డుకోవడం, దాడి చేయడం, పోలీసులు నిర్లక్ష్యం వంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేయగా, 300 మందికి పైగా అనుమానితుల్ని గుర్తించారు. కోర్టు ఈ ఘటనలో తన ప్రత్యేక అధికారాల కింద ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది.
Also Read
- PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
- Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
- Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ తిరస్కరణ
Read Also: Instagram Subscription Trend: సబ్స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?
రాష్ట్ర యంత్రాంగం పనితీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమయానికి స్పందించి ఉంటే, పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని కోర్టు అభిప్రాయపడింది. సీఎస్ తనకు ఫోన్ రాలేదని, తాను ఢిల్లీలో సమావేశంలో ఉన్నానని చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి మిమ్మల్ని సంప్రదించలేనంత స్థాయిలో మీరు లేరంటూ మందలించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పాలని సూచించింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా విచారణకు వచ్చిన న్యాయాధికారుల్ని కొంత మంది దిగ్బంధించారు. ఈ ఘటనలో ఎంఐఎం నేత కీలక పాత్ర పోషించినట్లు తేలింది. అతడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన బెంగాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలని బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన నుంచి అధికారాలను ఎన్నికల సంఘం లాగేసుకుందని విచిత్ర వాదన తీసుకువచ్చారు.
తాజావార్తలు
-
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
-
CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
-
Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
-
Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. “రాగి పాపడాలు” ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!