Supreme Court: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని సీఎస్పై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పశ్చిమ బెంగాల్ మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా బెంగాల్ అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేుసింది. ఈ ఘటన విచారణ సందర్భంగా కోర్టు బెంగాల్ సీఎస్ను నేరుగా ప్రశ్నిస్తూ.. ‘‘మీరు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు..? మీరు అంత గొప్పవారని అనుకోకండి, మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకోకండి’’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో ఒక మహిళా న్యాయమూర్తిని అడ్డుకోవడం, బెదిరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా జడ్జి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోర్టు సీరియస్గా వ్యవహరించింది.
ఎన్ఐఏ ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. విచారణకు సంబంధించిన విషయాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో న్యాయాధికారులను అడ్డుకోవడం, దాడి చేయడం, పోలీసులు నిర్లక్ష్యం వంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేయగా, 300 మందికి పైగా అనుమానితుల్ని గుర్తించారు. కోర్టు ఈ ఘటనలో తన ప్రత్యేక అధికారాల కింద ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది.
Also Read
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
Read Also: Instagram Subscription Trend: సబ్స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?
రాష్ట్ర యంత్రాంగం పనితీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమయానికి స్పందించి ఉంటే, పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని కోర్టు అభిప్రాయపడింది. సీఎస్ తనకు ఫోన్ రాలేదని, తాను ఢిల్లీలో సమావేశంలో ఉన్నానని చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి మిమ్మల్ని సంప్రదించలేనంత స్థాయిలో మీరు లేరంటూ మందలించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పాలని సూచించింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా విచారణకు వచ్చిన న్యాయాధికారుల్ని కొంత మంది దిగ్బంధించారు. ఈ ఘటనలో ఎంఐఎం నేత కీలక పాత్ర పోషించినట్లు తేలింది. అతడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన బెంగాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలని బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన నుంచి అధికారాలను ఎన్నికల సంఘం లాగేసుకుందని విచిత్ర వాదన తీసుకువచ్చారు.
తాజావార్తలు
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!