Supreme Court: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని సీఎస్పై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పశ్చిమ బెంగాల్ మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా బెంగాల్ అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేుసింది. ఈ ఘటన విచారణ సందర్భంగా కోర్టు బెంగాల్ సీఎస్ను నేరుగా ప్రశ్నిస్తూ.. ‘‘మీరు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు..? మీరు అంత గొప్పవారని అనుకోకండి, మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకోకండి’’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో ఒక మహిళా న్యాయమూర్తిని అడ్డుకోవడం, బెదిరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా జడ్జి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోర్టు సీరియస్గా వ్యవహరించింది.
ఎన్ఐఏ ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. విచారణకు సంబంధించిన విషయాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో న్యాయాధికారులను అడ్డుకోవడం, దాడి చేయడం, పోలీసులు నిర్లక్ష్యం వంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేయగా, 300 మందికి పైగా అనుమానితుల్ని గుర్తించారు. కోర్టు ఈ ఘటనలో తన ప్రత్యేక అధికారాల కింద ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Instagram Subscription Trend: సబ్స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?
రాష్ట్ర యంత్రాంగం పనితీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమయానికి స్పందించి ఉంటే, పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని కోర్టు అభిప్రాయపడింది. సీఎస్ తనకు ఫోన్ రాలేదని, తాను ఢిల్లీలో సమావేశంలో ఉన్నానని చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి మిమ్మల్ని సంప్రదించలేనంత స్థాయిలో మీరు లేరంటూ మందలించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పాలని సూచించింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా విచారణకు వచ్చిన న్యాయాధికారుల్ని కొంత మంది దిగ్బంధించారు. ఈ ఘటనలో ఎంఐఎం నేత కీలక పాత్ర పోషించినట్లు తేలింది. అతడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన బెంగాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలని బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన నుంచి అధికారాలను ఎన్నికల సంఘం లాగేసుకుందని విచిత్ర వాదన తీసుకువచ్చారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?