Supreme Court: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని సీఎస్పై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పశ్చిమ బెంగాల్ మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా బెంగాల్ అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేుసింది. ఈ ఘటన విచారణ సందర్భంగా కోర్టు బెంగాల్ సీఎస్ను నేరుగా ప్రశ్నిస్తూ.. ‘‘మీరు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు..? మీరు అంత గొప్పవారని అనుకోకండి, మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకోకండి’’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో ఒక మహిళా న్యాయమూర్తిని అడ్డుకోవడం, బెదిరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా జడ్జి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోర్టు సీరియస్గా వ్యవహరించింది.
ఎన్ఐఏ ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. విచారణకు సంబంధించిన విషయాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో న్యాయాధికారులను అడ్డుకోవడం, దాడి చేయడం, పోలీసులు నిర్లక్ష్యం వంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేయగా, 300 మందికి పైగా అనుమానితుల్ని గుర్తించారు. కోర్టు ఈ ఘటనలో తన ప్రత్యేక అధికారాల కింద ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది.
Also Read
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
Read Also: Instagram Subscription Trend: సబ్స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?
రాష్ట్ర యంత్రాంగం పనితీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమయానికి స్పందించి ఉంటే, పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని కోర్టు అభిప్రాయపడింది. సీఎస్ తనకు ఫోన్ రాలేదని, తాను ఢిల్లీలో సమావేశంలో ఉన్నానని చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి మిమ్మల్ని సంప్రదించలేనంత స్థాయిలో మీరు లేరంటూ మందలించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పాలని సూచించింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా విచారణకు వచ్చిన న్యాయాధికారుల్ని కొంత మంది దిగ్బంధించారు. ఈ ఘటనలో ఎంఐఎం నేత కీలక పాత్ర పోషించినట్లు తేలింది. అతడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన బెంగాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలని బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన నుంచి అధికారాలను ఎన్నికల సంఘం లాగేసుకుందని విచిత్ర వాదన తీసుకువచ్చారు.
తాజావార్తలు
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!