Varanasi: వారణాసి కాలేజ్లో మసీదును తొలగించాలి.. వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్తో వివాదం..
- వారణాసి కాలేజ్ నుంచి మసీదు తొలగించాలని డిమాండ్..
- వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసినట్లు నివేదికలు రావడంతో విద్యార్థుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీ క్యాంపస్లో మసీదు వివాదానికి ఆజ్యం పోసింది. మసీదును తొలగించాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు యాజమాన్యం ఈ స్థలాన్ని క్లెయిమ్ చేసినట్లు నివేదికలు రావడంతో నిరసన ప్రదర్శన జరిగింది. శుక్రవారం కాలేజీ గేటు వద్ద వందలాది మంది విద్యార్థులు జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. క్యాంపస్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నాయకుడు వివేకానంద్ సింగ్ మాట్లాడుతూ.. మసీదు ఉన్న స్థలం వక్ఫ్ బోర్డుకు చెందకపోతే నిర్మాణాన్ని అక్కడ నుంచి తొలగించాలని అన్నారు. మసీదులో నమాజ్ కొనసాగిస్తే, విద్యార్థులు అక్కడ హనుమాన్ చాలీసా పఠిచడం ద్వారా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.
Read Also: KTR : గాంధీభవన్ వెలవెలబోతుండగా.. తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషం
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు గురువారం క్యాంపస్లోకి బయట వ్యక్తుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఐడీ కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. మసీదు దగ్గర నమాజ్ చేస్తున్న సమయంలో హనుమాన్ చాలీసా పఠించిన తర్వాత మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వివాదంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టూడెంట్స్ ‘‘కాలేజ్ కోర్టు’’ ఏర్పాటు చేసి, వక్ఫ్ బోర్డుకు 11 పాయింట్లతో లేఖ పంపారు. మసీదు స్థితి, దాని యాజమాన్యం గురించి 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
115 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో పరిస్థితి వివాదాస్పదంగా మారింది. అయితే, వక్ఫ్ బోర్డు దావాని కాలేజీ అడ్మినిస్ట్రేషన్ తీవ్రంగా ఖండించింది. ఇది ఛారిటబుల్ ఎండోమెంట్కి చెందిన భూమి అని, వక్ఫ్ బోర్డుది కాదని పేర్కొంది. అయితే, మసీదు స్థితిని తనిఖీ చేయాలని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వక్ఫ్ బోర్డుకు లేఖ రాసింది. 2018 నాటి ఉత్తర్వుల ప్రకారం.. మసీదు వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేయడాన్ని 2021లో రద్దు చేసినట్లు మసీదు కమిటీ సెక్రటరీ మహ్మద్ యాసీన్ అన్నారు. ప్రస్తుత వివాదానికి కారణం లేదని చెప్పారు.
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?