Varanasi: వారణాసి కాలేజ్లో మసీదును తొలగించాలి.. వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్తో వివాదం..
- వారణాసి కాలేజ్ నుంచి మసీదు తొలగించాలని డిమాండ్..
- వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసినట్లు నివేదికలు రావడంతో విద్యార్థుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీ క్యాంపస్లో మసీదు వివాదానికి ఆజ్యం పోసింది. మసీదును తొలగించాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు యాజమాన్యం ఈ స్థలాన్ని క్లెయిమ్ చేసినట్లు నివేదికలు రావడంతో నిరసన ప్రదర్శన జరిగింది. శుక్రవారం కాలేజీ గేటు వద్ద వందలాది మంది విద్యార్థులు జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. క్యాంపస్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నాయకుడు వివేకానంద్ సింగ్ మాట్లాడుతూ.. మసీదు ఉన్న స్థలం వక్ఫ్ బోర్డుకు చెందకపోతే నిర్మాణాన్ని అక్కడ నుంచి తొలగించాలని అన్నారు. మసీదులో నమాజ్ కొనసాగిస్తే, విద్యార్థులు అక్కడ హనుమాన్ చాలీసా పఠిచడం ద్వారా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.
Read Also: KTR : గాంధీభవన్ వెలవెలబోతుండగా.. తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషం
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు గురువారం క్యాంపస్లోకి బయట వ్యక్తుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఐడీ కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. మసీదు దగ్గర నమాజ్ చేస్తున్న సమయంలో హనుమాన్ చాలీసా పఠించిన తర్వాత మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వివాదంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టూడెంట్స్ ‘‘కాలేజ్ కోర్టు’’ ఏర్పాటు చేసి, వక్ఫ్ బోర్డుకు 11 పాయింట్లతో లేఖ పంపారు. మసీదు స్థితి, దాని యాజమాన్యం గురించి 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
115 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో పరిస్థితి వివాదాస్పదంగా మారింది. అయితే, వక్ఫ్ బోర్డు దావాని కాలేజీ అడ్మినిస్ట్రేషన్ తీవ్రంగా ఖండించింది. ఇది ఛారిటబుల్ ఎండోమెంట్కి చెందిన భూమి అని, వక్ఫ్ బోర్డుది కాదని పేర్కొంది. అయితే, మసీదు స్థితిని తనిఖీ చేయాలని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వక్ఫ్ బోర్డుకు లేఖ రాసింది. 2018 నాటి ఉత్తర్వుల ప్రకారం.. మసీదు వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేయడాన్ని 2021లో రద్దు చేసినట్లు మసీదు కమిటీ సెక్రటరీ మహ్మద్ యాసీన్ అన్నారు. ప్రస్తుత వివాదానికి కారణం లేదని చెప్పారు.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!