Kerala: కేరళలో మరో ఫుడ్ పాయిజనింగ్ కేసు.. విద్యార్థులు, పేరెంట్స్కు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students, Parents Fall Ill After Eating Food: కేరళలో వరసగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పతినంతిట్ట జిల్లాలో ఓ చర్చ్ లో బాప్టిజం వేడుకలకు హాజరైన గ్రామస్తులు అక్కడి ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ తరువాత బిర్యానీ తిని ఓ యువతి మరణించింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో జరిగిన ఓ ఈవెంట్ లో విద్యార్థులు, తల్లిందండ్రులు ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కూడా పతినంతిట్ట జిల్లాలోనే చోటు చేసుకుంది. జిల్లాలోని కొడుమోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 6న ఓ పాఠశాల కార్యక్రమంలో ఆహారం తీసుకున్న తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు అస్వస్థతకు గురయ్యారు. నలుగురు చిన్నారులతో సహా, 7-8 మంది ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Also: WTC Final: ఆస్ట్రేలియాకు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు.. రెండో స్థానం ఎవరిది?
Also Read
ఇదిలా ఉంటే ఫుడ్ పాయిజనింగ్ తో ఇటీవల కేరళలో ఇద్దరు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాసర్ గోడ్ జిల్లా పెరంబాలకు చెందిన అంజు శ్రీపార్వతి అనే యువతి స్థానిక హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుని తిన్న తర్వాత శనివారం మరణించింది. అయితే అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోలేదని ఆహార భద్రతా అధికారులు వెల్లడించారు. యువతి తిన్న ఆహారంలో ఎటువంటి కల్తీ కనుగొనబడలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు కొట్టాయంకు చెందిన రేష్మి అనే నర్సు ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయింది. జనవరి 1న పతినంతిట్ట జిల్లా జనవరి 1న కీజ్వాయిపూర్ సమీపంలోని చర్చిలో బాప్టిజం సందర్భంగా వడ్డించిన ఆహారాన్ని తిన్న సుమారు 100 మంది అనుమానాస్పద ఫుడ్ పాయిజన్తో బాధపడ్డారు.
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!