Vande Bharat Express: మరోసారి వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. ఏడాదిలో 7వ సంఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్లదాడి జరిగింది. కొత్తగా ప్రారంభించిన డెహ్రాడూన్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గంలో ముజఫర్నగర్ స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ E1 కోచ్పై రాళ్ల దాడి జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ని మోహరించింది. ఈ మార్గంలో వందేభారత్ రైలును గత నెలలో ప్రధాని మోడీ ప్రారంభించారు.
Read Also: Karnataka Anna Bhagya : తలపట్టుకుంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. కేసీఆర్ కు ఫోన్ చేసి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఈ ఏడాది ఇది ఏడో దాడి. ఇంతకుముందు కూడా పలుమార్గాల్లో వందే భారత్ రైలుపై ఆకతాయిలు కావాలని దాడులకు తెగబడ్డారు.
జనవరి నెలలో విశాఖపట్నం వందేభారత్ రైలుపై ఇలానే కంచరపాలెం వద్ద రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో అద్దాలు పగిలిపోయాయి. రైలు ట్రయల్స్ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఏడాది జనవరిలో డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సిదేవా ప్రాంతానికి సమీపంలో రెండు కోచ్లపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. ఇదే నెలలో మాల్దా సమీపంలో హౌరా-న్యూ జల్పాయ్ గురి వందేభారత్ ట్రైన్ పై దాడి చేశారు. మార్చి 12 పశ్చిమ బెంగాల్ వందేభారత్ ట్రైన్ పై ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా వద్ద దాడి జరిగింది. ఏప్రిల్ 6న విశాఖ ట్రైన్ పై రాళ్లు రువ్వారు. మేలో కేరళలోని వందేభారత్ ట్రైన్ పై దాడి చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!