PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు..

  • రాజ్యాంగ ఆమోదానికి రేపటితో 75 ఏళ్లు..
  • విస్తృతంగా చర్చించి రాజ్యాంగాన్ని రూపొందించారు..
  • పార్లమెంట్‌ సమావేశాల్లో సరైన చర్చ జరగాలి..
  • కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోడీ
Pm Modi

Pm Modi

PM Modi: నేడు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్‌ దగ్గర భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను కోరారు. ప్రస్తుతం మనం 2024వ ఏడాదిని పూర్తి చేసుకోబోతున్నాం.. 2025 కోసం దేశం మొత్తం సిద్ధమవుతోందన్నారు. ఈ పార్లమెంట్ సెషన్స్ ఎన్నో అంశాల పరంగా ముఖ్యమైంది.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నామని పేర్కొన్నారు. దానికి గుర్తుగా రేపు సంవిధాన్‌ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందామని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Read Also: Prashant Kishor: బీహార్ చాలా దారుణమైన స్థితిలో ఉంది.. అది ఒక విఫల రాష్ట్రం..

ఇక, ప్రజల చేత తిరస్కరణకు గురైన కొందరు.. గూండాయిజం చేయించి.. పార్లమెంట్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. వారి చర్యలను దేశ ప్రజలు చూస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు వారు చూస్తూ ఊరుకోరని చెప్పుకొచ్చారు. అయితే, ఇక్కడ బాధించే విషయం ఏంటంటే.. పార్టీలతో సంబంధం లేకుండా కొత్తగా పార్లమెంట్‌కు ఎన్నికైన వారు సరికొత్త ఆలోచనలతోయ వస్తారు.. కొందరు చేసే గందరగోళ చర్యల వల్ల కొత్తగా వచ్చిన ఎంపీలకు సభలో మాట్లాడే ఛాన్స్ రావడం లేదన్నారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించాలి.. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలన్నారు. అలాంటి వారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదు.. కాబట్టి ప్రజల అంచనాలను ఎన్నటికీ అందుకోలేరని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.