Tamil Nadu: 8 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన ఎలుగుబంటి.. చివరకు ఏం జరిగిందంటే..?
- తమిళనాడులో దారుణం..
- వాల్పారైలో 8 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన ఎలుగుబంటి..
- బాలుడి మృతదేహాన్ని అటవీలో గుర్తించిన పోలీసులు..
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో సోమవారం నాడు సాయంత్రం ఘోర విషయం చోటు చేసుకుంది. స్థానిక టీ తోటలో అస్సాం నుంచి వలస వచ్చి కూలీలుగా పని చేస్తున్న దంపతుల కుమారుడు నూర్-ఉల్-హక్ పాలు తీసుకురావడానికి సమీపంలోని ఇంటికి వెళ్లాగా.. ఆ సమయంలో దారి తప్పి వచ్చిన ఒక స్లోత్ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది. ఇక, ఆ బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అనేక చోట్ల వెతికారు. అయితే, మార్గమధ్యంలో చిందర వందరగా పాలు, రక్తపు మరకలు కనిపించాయి. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో టీ తోట కార్మికులు గాలించగా.. కొద్దీ దూరంలో నూర్-ఉల్-హక్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక, బాలుడి ఒక కన్ను, ముఖంలోని ఒక భాగం, మెదడులోని కొంతభాగాన్ని ఎలుగుబంటి తిన్నట్లు అధికారులు గుర్తించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న కాడంపారై పోలీసులు, అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
Read Also: Trivikram Srinivas: నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించలేను అన్నారు!
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
అయితే, ఇదే ప్రాంతంలో గత ఆరు నెలల్లో ఇది రెండో దారుణ ఘటన. జూన్ మాసంలో పాచమలై ఎస్టేట్ సమీపంలోని కలియమ్మాల్ నివాస ప్రాంతంలో జార్ఖండ్ నుంచి వలస వచ్చిన దంపతులకు చెందిన నలుగురేళ్ల రోషిని కుమారి ఆడుకుంటూ ఉండగా చిరుతపులి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ ఘటనపై పోలీసులు, అటవీ అధికారులు కలిసి రోషిని మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ చిన్నారి శరీర భాగాలు అక్కడక్కడా చిందర వందరగా పడ్డాయని చెప్పారు. ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!