Tamil Nadu: 8 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన ఎలుగుబంటి.. చివరకు ఏం జరిగిందంటే..?
- తమిళనాడులో దారుణం..
- వాల్పారైలో 8 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన ఎలుగుబంటి..
- బాలుడి మృతదేహాన్ని అటవీలో గుర్తించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో సోమవారం నాడు సాయంత్రం ఘోర విషయం చోటు చేసుకుంది. స్థానిక టీ తోటలో అస్సాం నుంచి వలస వచ్చి కూలీలుగా పని చేస్తున్న దంపతుల కుమారుడు నూర్-ఉల్-హక్ పాలు తీసుకురావడానికి సమీపంలోని ఇంటికి వెళ్లాగా.. ఆ సమయంలో దారి తప్పి వచ్చిన ఒక స్లోత్ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది. ఇక, ఆ బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అనేక చోట్ల వెతికారు. అయితే, మార్గమధ్యంలో చిందర వందరగా పాలు, రక్తపు మరకలు కనిపించాయి. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో టీ తోట కార్మికులు గాలించగా.. కొద్దీ దూరంలో నూర్-ఉల్-హక్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక, బాలుడి ఒక కన్ను, ముఖంలోని ఒక భాగం, మెదడులోని కొంతభాగాన్ని ఎలుగుబంటి తిన్నట్లు అధికారులు గుర్తించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న కాడంపారై పోలీసులు, అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
Read Also: Trivikram Srinivas: నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించలేను అన్నారు!
Also Read
- BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
- Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
- Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
- Siddaramaiah: "నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు".. సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
అయితే, ఇదే ప్రాంతంలో గత ఆరు నెలల్లో ఇది రెండో దారుణ ఘటన. జూన్ మాసంలో పాచమలై ఎస్టేట్ సమీపంలోని కలియమ్మాల్ నివాస ప్రాంతంలో జార్ఖండ్ నుంచి వలస వచ్చిన దంపతులకు చెందిన నలుగురేళ్ల రోషిని కుమారి ఆడుకుంటూ ఉండగా చిరుతపులి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ ఘటనపై పోలీసులు, అటవీ అధికారులు కలిసి రోషిని మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ చిన్నారి శరీర భాగాలు అక్కడక్కడా చిందర వందరగా పడ్డాయని చెప్పారు. ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..