Man-eating Tiger: మనిషి మాంసానికి మరిగిన పులి.. చంపేయాలంటూ సర్కార్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoot-at-sight order issued against a man-eater tiger in Bihar: మనిషి మాంసం తినడానికి అలవాటు పడిన పులిని చంపేయాలని బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో ప్రజలుపై మ్యాన్ ఈటర్ పులి దాడులు ఎక్కువ అయ్యాయి. మొత్తం 9 మందిపై దాడి చేసింది. పులిని చంపేయాలంటూ.. బీహార్ సర్కార్ షూట్ అట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసింది. గత సెప్టెంబర్ నెల నుంచి పశ్చిమ చంపారన్ జిల్లాలోని వాల్మీకి టైగర్ రిజర్వ్(వీటీఆర్) చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుగురుని చంపింది. మొత్తంగా 12 ఏళ్ల బాలికతో సహా 9 మందిని చంపేసింది.
రంగియా అటవీ రేంజ్ లోని సింగహీ పంచాయతీ పరిధిలోని దుమారి గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని శుక్రవారం ఉదయం పులి చంపేసింది. అంతకుముందు రోజు గురువారం మరో వ్యక్తిపై కూడా దాడి చేసి చంపింది. గత నెల కాలంలో నలుగురిని పులి హతమార్చి తిన్నది. దీంతో మనిషి మాంసానికి మరిగిన పులిని చంపేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అంతకుముందు సింగహి ముస్టోలి గ్రామంలో బుధవారం రోజున 12 ఏళ్ల బాలిక పడుకున్న సమయంలో దాడి చేసి, మెడను నోట కరుచుకుని తీసుకెళ్లింది. ఆ తరువాత బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రిజర్వ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ నేషమని కే తెలిపారు. మే నుంచి ఇప్పటి వరకు మొత్తం 9 మందిని చంపినట్లు వెల్లడించారు. దీంతో డిపార్ట్మెంట్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్-కమ్-చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ శ్రీ ప్రభాత్ కుమార్ గుప్తా చంపేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
Read Also: Madhya Pradesh: రైలులో మహిళను వేధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కేసు నమోదు.
గత 25 రోజులలలో చివ్తహాన్, గోవర్థర్ అటవీ ప్రాంతానికి సమీపంలో పులి దాడులు చేసింది. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలో కి దిగింది. హైదరాబాద్ కు చెందిన షార్ఫ్ షూటర్ షఫత్ అలీ ఖాన్ తో పాటు మరికొంత మంది పులిని ట్రాక్ చేస్తున్నారు. గత ఆరు రోజులుగా పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యాన్ ఈటర్ గా మారిన పులి వయస్సు 3.5 ఏళ్లు ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం దమ్రో గ్రామంలో సంజయ్ మహ్తో(35) వ్యక్తిపై దాడి చేసి స్థానికంగా ఉన్న చెరుకు తోటల్లోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు.
బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న వాల్మీకి నేషనల్ పార్క్ రాష్ట్రంలో ఏకైక జాతీయ టైగర్ రిజర్వ్. మొత్తం 898.45 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది విస్తరించి ఉంది. 2018 పులుల గణాంకాల ప్రకారం.. ఇక్కడ మొత్తం 40 పులులు ఉన్నట్లుగా తేలింది.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..