Man-eating Tiger: మనిషి మాంసానికి మరిగిన పులి.. చంపేయాలంటూ సర్కార్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoot-at-sight order issued against a man-eater tiger in Bihar: మనిషి మాంసం తినడానికి అలవాటు పడిన పులిని చంపేయాలని బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో ప్రజలుపై మ్యాన్ ఈటర్ పులి దాడులు ఎక్కువ అయ్యాయి. మొత్తం 9 మందిపై దాడి చేసింది. పులిని చంపేయాలంటూ.. బీహార్ సర్కార్ షూట్ అట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసింది. గత సెప్టెంబర్ నెల నుంచి పశ్చిమ చంపారన్ జిల్లాలోని వాల్మీకి టైగర్ రిజర్వ్(వీటీఆర్) చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుగురుని చంపింది. మొత్తంగా 12 ఏళ్ల బాలికతో సహా 9 మందిని చంపేసింది.
రంగియా అటవీ రేంజ్ లోని సింగహీ పంచాయతీ పరిధిలోని దుమారి గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని శుక్రవారం ఉదయం పులి చంపేసింది. అంతకుముందు రోజు గురువారం మరో వ్యక్తిపై కూడా దాడి చేసి చంపింది. గత నెల కాలంలో నలుగురిని పులి హతమార్చి తిన్నది. దీంతో మనిషి మాంసానికి మరిగిన పులిని చంపేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అంతకుముందు సింగహి ముస్టోలి గ్రామంలో బుధవారం రోజున 12 ఏళ్ల బాలిక పడుకున్న సమయంలో దాడి చేసి, మెడను నోట కరుచుకుని తీసుకెళ్లింది. ఆ తరువాత బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రిజర్వ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ నేషమని కే తెలిపారు. మే నుంచి ఇప్పటి వరకు మొత్తం 9 మందిని చంపినట్లు వెల్లడించారు. దీంతో డిపార్ట్మెంట్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్-కమ్-చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ శ్రీ ప్రభాత్ కుమార్ గుప్తా చంపేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Read Also: Madhya Pradesh: రైలులో మహిళను వేధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కేసు నమోదు.
గత 25 రోజులలలో చివ్తహాన్, గోవర్థర్ అటవీ ప్రాంతానికి సమీపంలో పులి దాడులు చేసింది. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలో కి దిగింది. హైదరాబాద్ కు చెందిన షార్ఫ్ షూటర్ షఫత్ అలీ ఖాన్ తో పాటు మరికొంత మంది పులిని ట్రాక్ చేస్తున్నారు. గత ఆరు రోజులుగా పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యాన్ ఈటర్ గా మారిన పులి వయస్సు 3.5 ఏళ్లు ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం దమ్రో గ్రామంలో సంజయ్ మహ్తో(35) వ్యక్తిపై దాడి చేసి స్థానికంగా ఉన్న చెరుకు తోటల్లోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు.
బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న వాల్మీకి నేషనల్ పార్క్ రాష్ట్రంలో ఏకైక జాతీయ టైగర్ రిజర్వ్. మొత్తం 898.45 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది విస్తరించి ఉంది. 2018 పులుల గణాంకాల ప్రకారం.. ఇక్కడ మొత్తం 40 పులులు ఉన్నట్లుగా తేలింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..