Maharashtra CM Post: షిండే వర్గం సంచలన నిర్ణయం!
- షిండే వర్గం సంచలన నిర్ణయం!
- బీజేపీ ప్రభుత్వంలో పదవులకు దూరంగా ఉండాలని డిసైడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ వీడడం లేదు. అసెంబ్లీ ఫలితాలు వచ్చి దాదాపు 7 రోజులు అవుతున్నా.. సీఎం ఎవరనేది తేల్చలేకపోయారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చకపోవడంతో ఏక్నాథ్ షిండే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో అలకబూని ఆయన సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే తాజాగా షిండేకు చెందిన శివసేన పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితే.. పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Potato Rate : ఒక్క సారిగా పెరిగిన బంగాళాదుంప ధరలు.. పెరగడానికి కారణం ఇదే
Also Read
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) ఘన విజయం సాధించింది. అయితే కూటమిలో నెలకొన్న అంతర్గత విభేదాలతో సీఎం ఎంపిక కావడంలేదని తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన.. బీహార్ ఫార్ములా అమలు చేయాలని.. నితీష్కుమార్లాగానే షిండేను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్లో నితీష్ కుమార్ పార్టీకి మెజార్టీ లేకపోయినా సీఎంగా కొనసాగుతున్నారు. అదే పద్ధతిని మహారాష్ట్రలో అమలు చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కానీ బీజేపీ 132 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పోస్టు.. కమలనాథులే దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇలా ఇరు పార్టీల మధ్య తర్జన భర్జనతో పంచాయితీ ఎటు తెగకుండా నాన్చుడి సాగుతోంది. మరోవైపు అలకతో షిండే తన సొంతూరు వెళ్లిపోయారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామమైన డేర్కు వెళ్లారు.
ఇది కూడా చదవండి:CM Chandrababu: రాజ్భవన్కు సీఎం చంద్రబాబు.. గవర్నర్, మాజీ రాష్ట్రపతితో మంతనాలు..
ఇదిలా ఉంటే ఈ అర్ధరాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రకటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు శివసేన నేత సంజయ్ శిర్సత్ అన్నారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ప్రధాని మోడీ, అమిత్ షా నిర్ణయించారని… ఈరోజు అర్ధరాత్రిలోగా సీఎం పేరు ప్రకటిస్తారని పేర్కొన్నారు. డిసెంబరు 2న ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. పదవులకు దూరంగా ఉండాలని పార్టీ నేతలకు షిండే సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Alone Honeymoon: ఒంటరిగా హనీమూన్కి వెళ్లిన పెళ్లికూతురు.. ఇదో విషాధ గాధ!
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?