Maharashtra CM Post: షిండే వర్గం సంచలన నిర్ణయం!
- షిండే వర్గం సంచలన నిర్ణయం!
- బీజేపీ ప్రభుత్వంలో పదవులకు దూరంగా ఉండాలని డిసైడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ వీడడం లేదు. అసెంబ్లీ ఫలితాలు వచ్చి దాదాపు 7 రోజులు అవుతున్నా.. సీఎం ఎవరనేది తేల్చలేకపోయారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చకపోవడంతో ఏక్నాథ్ షిండే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో అలకబూని ఆయన సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే తాజాగా షిండేకు చెందిన శివసేన పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితే.. పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Potato Rate : ఒక్క సారిగా పెరిగిన బంగాళాదుంప ధరలు.. పెరగడానికి కారణం ఇదే
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) ఘన విజయం సాధించింది. అయితే కూటమిలో నెలకొన్న అంతర్గత విభేదాలతో సీఎం ఎంపిక కావడంలేదని తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన.. బీహార్ ఫార్ములా అమలు చేయాలని.. నితీష్కుమార్లాగానే షిండేను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్లో నితీష్ కుమార్ పార్టీకి మెజార్టీ లేకపోయినా సీఎంగా కొనసాగుతున్నారు. అదే పద్ధతిని మహారాష్ట్రలో అమలు చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కానీ బీజేపీ 132 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పోస్టు.. కమలనాథులే దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇలా ఇరు పార్టీల మధ్య తర్జన భర్జనతో పంచాయితీ ఎటు తెగకుండా నాన్చుడి సాగుతోంది. మరోవైపు అలకతో షిండే తన సొంతూరు వెళ్లిపోయారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామమైన డేర్కు వెళ్లారు.
ఇది కూడా చదవండి:CM Chandrababu: రాజ్భవన్కు సీఎం చంద్రబాబు.. గవర్నర్, మాజీ రాష్ట్రపతితో మంతనాలు..
ఇదిలా ఉంటే ఈ అర్ధరాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రకటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు శివసేన నేత సంజయ్ శిర్సత్ అన్నారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ప్రధాని మోడీ, అమిత్ షా నిర్ణయించారని… ఈరోజు అర్ధరాత్రిలోగా సీఎం పేరు ప్రకటిస్తారని పేర్కొన్నారు. డిసెంబరు 2న ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. పదవులకు దూరంగా ఉండాలని పార్టీ నేతలకు షిండే సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Alone Honeymoon: ఒంటరిగా హనీమూన్కి వెళ్లిన పెళ్లికూతురు.. ఇదో విషాధ గాధ!
తాజావార్తలు
-
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్తో మరో రికార్డు?
-
Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
-
BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!