Sheikh Hasina: ‘‘నా తల్లిని కాపాడినందుకు మోడీకి, భారత్కి కృతజ్ఞతలు’’.. షేక్ హసీనా కుమారుడు..
- నా తల్లిని రక్షించిన భారత్.. పీఎం మోడీకి కృతజ్ఞతలు.. బంగ్లాదేశ్లో త్వరగా ఎన్నికలు జరపాలని కోరిన షేక్ హసీనా కుమారుడు..
- ఆ దేశంలో ‘‘మూక పాలన’’ కొనసాగుతోందన్న సజీబ్ వాజెద్ జాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లు, షేక్ హసీనానా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయేలా చేసింది. బంగ్లా ఆర్మీ 45 నిమిషాల అల్టిమేటంతో ఆమె హుటాహుటిన రాజధాని ఢాకాను వదిలి ఆ దేశ ఆర్మీ విమానంలో ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్బేస్కి చేరారు. అయితే, తన తల్లిని రక్షించినందుకు షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్(53) భారతదేశానికి, ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ అధికారు ఆ దేశంలో ‘‘ మూక పాలన’’కు అనుమతించారని ఆరోపించారు. ఈ పరిణామాలు వేగంగా ఎన్నికలు జరగకుండా గందరగోళానికి దారి తీస్తాయని హెచ్చరించారు. ప్రస్తుత తత్కాలిక ప్రభుత్వం ‘‘పూర్తిగా శక్తిలేనిది’’గా అభివర్ణించారు. ఏఏఫ్పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో ‘‘ మూకపాలన’’ కొనసాగుతోందని అన్నారు. నిరసనకారుల డిమాండ్లతో ప్రధాన న్యాయమూర్తి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, పోలీస్ చీఫ్తో సహా పలువురు ఉన్నతాధికారుల తొలగింపును ఆయన ప్రస్తావించారు. రేపు ఈ గుంపు తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని మార్చాలని కోరుకుంటే, అతడిని కూడా మార్చాల్సి ఉంటుందని అక్కడి పరిస్థితిని ఎత్తి చూపారు.
Also Read
కొద్ది నెలల్లో అక్కడ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ చెప్పారు. అయితే, ఎన్నికలు ఆలస్యమైతే బంగ్లాదేశ్లో ప్రమాదాలు ఉంటాయని అన్నారు. ఎన్నికలు నిర్వహించిన చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కూడా మూకదాడులు జరుగుతున్నాయి. దీంతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అవామీ లీగ్ లేకుండా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించలేరు, దేశంలో సగం మంది ప్రజలు దీనిని ఎప్పటికీ అంగీకరించరని ఆయన అన్నారు.
షేక్ హసీనా భారత్లో ఎంతకాలం ఉంటుందో తెలియదని వాజెద్ చెప్పారు. ఆమె వేరే దేశానికి వెళ్లడానికి ఇప్పటికీ ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. తన తల్లి ఎప్పుడూ బంగ్లాదేశ్ని వదలాలని అనుకోలేదని, అక్కడే పదవి విరమణ చేయాలనేదే ఆమె కల అని చెప్పారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?