Omar Abdullah: రుబయ్యా సయీద్, IC 814 హైజాక్ విషయంలో మా నాన్నను ఒత్తిడి చేశారు..
- IC 814 హైజాక్ సమయంలో మా నాన్నపై ఒత్తిడి చేశారు..
- రుబయ్యా సయీద్ కిడ్నాప్ తర్వాత ఇది రెండో సంఘటన..
- జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘IC814: కాందహార్ హైజాక్’ సంచలనంగా మారింది. ఇందులో ఉగ్రవాదులను హిందూ పేర్లతో పిలవడంపై రచ్చ మొదలైంది. అయితే, కేంద్రం వార్నింగ్తో మరోసారి ఇలాంటి ఘటన జరగదని నెట్ఫ్లిక్స్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా కూడా వేడిని పెంచుతోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా IC814 ఫ్లైట్ హైజాక్పై కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా రెండు సందర్భాల్లో తీవ్ర ఒత్తిడితో నిర్ణయాలు తీసుకున్నారని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఒకటి మాజీ హో మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తు రుబయ్యా సయీద్ కిడ్నాప్ సంఘటన ఒకటైతే, మరొకటి IC814 హైజాక్ సంఘటన అని చెప్పారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా సీఎంగా ఉన్న సమయంలో IC814 హైజాక్ కారణంగా ఖైదీలను విడుదల చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Kolkata Doctor Murder Case: “నన్ను ఇరికించారు”.. పాలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు సంచలన విషయాలు
1989లో కాశ్మీరీ వేర్పాటువాదులు కిడ్నాప్కి గురైన మాజీ హోం మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా సయీద్ని విడిపించడానికి, అప్పటి వీపీ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్కి చెందిన ఐదుగురు ఉగ్రవాదుల్ని జైలు నుంచి విడుదల చేశారు. రుబయ్యాని సురక్షితంగా రక్షించేందుకు కేంద్రం ఉగ్రవాదుల్ని విడుదల చేసింది.
‘‘ మా నాన్నని ప్రజలు ఒత్తిడి చేయడం రెండుసార్లు జరిగింది. రుబయ్యా సయీద్ విడుదల చేసిన సంగతిని గుర్తు చేస్తూ హైజాక్లో చిక్కుకున్న ప్రయాణికులు కుటుంబాల కోసం ఉగ్రవాదుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఉగ్రవాదుల కోసం ఒక హోం మంత్రి కుమార్తెని విడుదల చేస్తే, మా కుటుంబాల కోసం ఎందుకు విడుదల చేయరు..? ఆమె దేశానికి ఎందుకు విలువైంది..? అలాగే మా కుటుంబాలు కూడా మాకు విలువని కావా..?’’ అని ప్రశ్నించినట్లు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. 1999లో ఖాట్మాండు నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ IC814 విమానాన్ని హర్కత్ ఉల్ ముజాహిదీన్కి చెందిన ఐదుగురు టెర్రరిస్టులు హైజాక్ చేశారు. విమానాన్ని అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆప్ఘనిస్తాన్ కంట్రోల్లోని కాందహార్ తరలించారు. ప్రయాణికుల్ని రక్షించేందుకు జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!