Influenza A: మార్చి చివరి నాటికి ఇన్ఫ్లూయెంజా తగ్గుముఖం.. హెచ్3ఎన్2ను పరిశీలిస్తున్నామన్న కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Influenza A(H3N2) Cases: దేశవ్యాప్తంగా సీజనల్ ఇన్ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ లక్షణాలతో ఈ వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీర్ఘకాలిక దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ కారణంగా దేశంలో 2 మరణాలు సంభవించాయి. ‘‘హాంకాంగ్ ఫ్లూ’’గా పిలిచే హెచ్3ఎన్2 వైరస్ వల్ల దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఇదిలా ఉంటే మార్చి చివర నాటికి సీజనల్ ఇన్ఫ్లూయెంజా కేసులు తగ్గుతాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదు అవుతున్న సీజనల్ ఇన్ఫ్లూయెంజా కేసుల పరిస్థితిని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్పీ) ద్వారా పరిశీలస్తున్నట్లు వెల్లడించింది. మార్చి చివరినాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వైరస్ చిన్న పిల్లలు, వృద్ధుల్లో ప్రాణాంతకంగా మారుతోందని, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా వల్ల ఇద్దరు మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని హసన్లో 82 ఏళ్ల వృద్ధుడు దేశంలోనే హెచ్3ఎన్2తో మరణించిన మొదటి వ్యక్తిగా భావిస్తున్నారు.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
Read Also: CM KCR : ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్
దేశంలో ఇప్పటి వరకు 90 హెచ్2ఎన్2 వైరస్ కేసులు నమోదు అయ్యాయని, ఎనిమిది హెచ్1ఎన్1 వైరస్ కేసులు కనుక్కున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇన్ఫ్లూయెంజా ఏ వైరస్ రకంలో ఉపరకంగా హెచ్3ఎన్2 వైరస్ ఉంది. దీని వల్ల శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. జనవరి నుంచి మార్చి వరకు అంటే రుతుపవన అనంతర కాలం సీజనల్ ఇన్ఫ్లూయెంజా ప్రబులుతుంది. మార్చి నెలఖరుకు తగ్గుముఖం పడుతుందని కే్ంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రీట్మెంట్ ప్రోటోకాల్, వెంటిలేటరీ నిర్వహణపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. హెచ్1ఎన్1 కేసులతో వ్యవహరించే ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 రెండూ కూడా కోవిడ్ తరహా లక్షలణాలను కలిగి ఉంటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సోకింది. ప్రపంచవ్యాప్తంగా 6.8 మిలియన్ల మరణాలకు కారణం అయింది. నిరంతర దగ్గు, జ్వరం, చలి, ఊపిరి ఆడకపోవడం మరియు శ్వాసలో గురక వంటి లక్షణాలు ఉంటాయి. రోగులు వికారం, గొంతు నొప్పి, శరీర నొప్పి మరియు విరేచనాల వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు దాదాపు ఒక వారం పాటు కొనసాగవచ్చు.
తాజావార్తలు
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..