Manipur Reopens Schools: మణిపూర్లో పునః ప్రారంభమైన స్కూల్స్.. మొదటి రోజు తక్కువ హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Reopens Schools: మణిపూర్లో జాతుల మధ్య గొడవ కారణంగా హింస మధ్య మూతపడిన పాఠశాలలు బుధవారం పునః ప్రారంభమయ్యాయి. బుధవారం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్క్ ప్రారంభమయ్యాయి. మొదటి రోజు హాజరు తక్కువగా ఉన్నట్టు పాఠశాలల హెడ్మాష్టర్లు తెలిపారు. మొదటి రోజు హాజరు తక్కువగా ఉన్నప్పటికీ.. పాఠశాలలను పునఃప్రారంభించాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు స్వాగతించారు. జాతి ఘర్షణల కారణంగా కొన్ని నెలల పాటు మూసివేయబడిన తరువాత బుధవారం మణిపూర్ అంతటా పాఠశాలలు తిరిగి తెరవబడ్డాయి. మొదటి రోజు చాలా విద్యాసంస్థల్లో హాజరు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, తరగతులను పునఃప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. జూలై 5 నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
Read also: Balagam Movie: ‘బలగం’కు మరో అరుదైన రికార్డు.. ఏకంగా 100 ఇంటర్నేషనల్ అవార్డులు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
పాఠశాలకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నామని రెండు నెలల తర్వాత విద్యార్థులు వారి స్నేహితులను మరియు ఉపాధ్యాయులను కలుసుకోగలుగుతున్నామని.. అంతేకాకుండా కొత్త విషయాలను నేర్చుకుంటామని విద్యార్థులు చెబుతున్నారు.
పాఠశాలల మూసివేత తన జీవితాన్ని చాలా పనిలేకుండా మరియు బోరింగ్గా మార్చిందని ఒక ఉపాధ్యాయురాలు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ కనీసం కొన్ని గంటలపాటు పాఠశాలలు తెరిచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఒక విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తరగతులు కొనసాగించడానికి పరిస్థితి సాధారణంగానే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్య కీలకమని రాష్ట్రంలో శాంతి నెలకొనాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే విద్యార్థుల భద్రతపై తనకు కొంత ఆందోళన ఉందన్నారు. ఇంఫాల్ నడిబొడ్డున స్కూల్ ఉంది కాబట్టి తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి తాను భయపడటం లేదని.. కానీ ప్రభుత్వం విద్యార్థుల భద్రత కోసం ఏర్పాట్లు చేస్తే చాలా బాగుంటుందని ఒక విద్యార్థి తండ్రి కోరారు.
Read also: MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అరెస్ట్.. కారణం ఇదే..
వాంగ్ఖీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఆర్కె రంజితా దేవి తరగతులను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతించారు. మే మొదటి వారం నుండి పాఠశాలలు మూసివేయబడటంతో, చాలా మంది విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించలేకపోయారని.. వారి మనస్సు మళ్ళించబడిందని దేవి చెప్పారు. తమ పాఠశాలలో మొదటి రోజు హాజరు కేవలం 10 శాతం మాత్రమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది పెరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఇంటర్నెట్పై నిషేధం ఉన్నందున, ఆన్లైన్ తరగతులు కూడా సాధ్యం కాదని దేవి చెప్పారు. ఇంటర్నెట్ నిషేధం కారణంగా, ఆన్లైన్ తరగతులు సాధ్యం కాదు కాబట్టి విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తామే సాధారణ తరగతుల సమయంలో అసైన్మెంట్లు మరియు హోంవర్క్లు ఇస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!