Bodh Gaya Temple: మహాబోధి ఆలయం కింద ‘‘భారీ నిర్మాణ సంపద’’.. శాటిలైట్ చిత్రాలతో వెలుగులోకి..
- బోధ్ గయ ఆలయం కింద భారీ నిర్మాణాలు..
- శాటిలైట్ చిత్రాల విశ్లేషణ ద్వారా వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bodh Gaya Temple: గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించి నాలుగు పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా ఉన్న బోధ్ గయాలోని మహాబోధి ఆలయం కింద ‘భారీ నిర్మాణ సంపద’ దాగి ఉన్నట్లు శాటిలైట్ సర్వే విశ్లేషన్ ద్వారా ఆధారాలు లభించాయని అధికారులు శనివారం తెలిపారు. యూకే కార్డిఫ్ యూనివర్సిటీ సహకారంతో బీహార్ హెరిటేజ్ డెవలప్మెంట్ సొసైటీ(బీహెచ్డీఎస్) ఈ అధ్యయనం చేస్తోంది. మహాబోధి ఆలయ సముదాయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్రదేశం బోధ్ గయ.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, దాని పరిసర ప్రాంతాల నేల కింద భారీ పురావస్తు నిర్మాణాలు ఉన్నట్లు అధ్యయనం కనుగొందని, అధికారి హర్జోత్ కౌర్ బమ్రాహ్ చెప్పారు. మహాబోధి ఆలయం మరియు దాని పరిసరాల యొక్క ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేశామని, కనుగొన్న వాటిని చైనీస్ యాత్రికుడు జువాన్ జాంగ్(హుయత్సాంగ్) చెప్పిన వివరాలతో ప్రస్తుతం కనుగొన్నవాటిని అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు బెంగళూర్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఫ్యాకల్టీ సభ్యుడు MB రజనీ చెప్పారు.
Also Read
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
బోధ్ గయలోని ప్రస్తుత మహాబోధి ఆలయ సముదాయంలో 50 మీటర్ల ఎత్తైన ఆలయం వజ్రాసనం, పవిత్ర బోధి వృక్షం మరియు బుద్ధుని జ్ఞానోదయానికి సంబంధించిన ఇతర ఆరు పవిత్ర స్థలాలు ఉన్నాయి. పరిశోధకులు 7వ శతాబ్దపు చైనీస్ సన్యాసి జువాన్జాంగ్ యొక్క భారతదేశ ప్రయాణంపై ఈ ప్రాజెక్ట్పై పని చేస్తోంది. ఆలయానికి ఉత్తరాన, భూగర్భం కింద అనేక నిర్మాణాలు ఉన్నట్లు శాటిలైట్ల చిత్రాల విశ్లేషణ ద్వారా తెలిసింది. నిరంజన నది తూర్పు నుంచి పడమరకు మారడాన్ని చిత్రాలు చూపిస్తున్నాయి.
Read Also: Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం మహాబోధి ఆలయం నదికి పశ్చిమాన ఉంది, సుజాత స్థూపం, ఇతర పురావస్తు అవశేషాలు నదికి తూర్పున ఉన్నాయి, నదికి తూర్పుగా ఉన్న అవవేశాలు ఇప్పుడు మహాబోధి ఆలయంలో స్వతంత్రమైనవిగా ఉన్నాయి. కానీ ఆలయం, సుజాత స్థూపం, ఇతర పురావస్తు అవశేషాలు రెండూ కూడా గతంలో ఒకే నది ఒడ్డున ఉన్నాయని తాజా అన్వేషణ చూపిస్తుందని పరిశోధకులు చెప్పారు. దీని ప్రకారం చూస్తే, స్మారక చిహ్నాలు, ఇతర పురావస్తు అవశేషాలు నదికి తూర్పున మహాబోధి కాంప్లెక్స్లో భాగంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.
చైనీస్ బౌద్ధ సన్యాసి హుయెత్సాంగ్ని జువాన్ జాంగ్గా పిలుస్తారు. ఇతను హర్షవర్ధన రాజు పాలనతో భౌద్ధ గ్రంథాలను పొందేందుకు చైనా నుంచి భారత్కి వచ్చాడు. 629 నుంచి 645 CE వరకు భారతదేశంలో పర్యటించాడు. 657 భారతీయ గ్రంథాలను చైనాకు తీసుకురావడాని కృషి చేశాడు. ఇతని రచనల ద్వారా చైనాలో బౌద్ధం బలపడింది. 1860-1870లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నలంద, వైశాలి వంటి ప్రదేశాలను గుర్తించేందుకు ఇతని యాత్రా, రచనలు ఉపయోగపడ్డాయి.
తాజావార్తలు
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!