Ajit Pawar: సైఫ్ అలీ ఖాన్ నిందితుడి గురించి కీలక విషయం చెప్పిన అజిత్ పవార్..
- సైఫ్ అలీ ఖాన్ ఇళ్లు అని తెలియక ప్రవేశించాడు..
- నిందితుడు బంగ్లాదేశ్కి చెందిన వాడు..
- ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఇంట్లో దొంగతానికి వచ్చిన దుండగుడు సైఫ్పై దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ రోజు థానేలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని, అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిస్తున్నా అనే విషయం తెలియదని చెప్పారు. నిందితుడి ప్రధాన ఉద్దేశం దొంగతనం చేయడమని, దాడి చేయడం కాదని స్పష్టం చేశారు. ‘‘నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత ముంబైలో శాంతిభద్రతలు కుప్పకూలాయని కొందరు ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు. అయితే, వాస్తవాలు మరోలా కనిపిస్తున్నాయి. నిందితుడు బంగ్లాదేశ్ నుండి వచ్చాడు, మొదట కోల్కతాకు వచ్చి, ఆ తర్వాత ముంబైకి ప్రయాణించాడు. తాను దొంగతనం చేయబోతున్న ఇళ్లు సైఫ్ అలీ ఖాన్ది అని నిందితుడికి తెలియదు’’ అని అన్నారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: Trump Trip To India: భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తి.. సలహాదారులతో చర్చ..
జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు దాడి చేసిన ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ముంబై సురక్షితంగా లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ వంటి నేతలు మహాయుతి సర్కార్ని విమర్శించారు. దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఒక సంఘటన ఆధారంగా ముంబై సురక్షితంగా లేదనే ముద్ర వేయడం సరికాదని అన్నారు. మెగాసిటీలలో ముంబై అత్యంత సురక్షితమైనదని ఫడ్నవీస్ అన్నారు. నిందితుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ని ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసి బంద్రా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 5 రోజుల కస్టడీకి అప్పగించింది.
తాజావార్తలు
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!