Ajit Pawar: సైఫ్ అలీ ఖాన్ నిందితుడి గురించి కీలక విషయం చెప్పిన అజిత్ పవార్..
- సైఫ్ అలీ ఖాన్ ఇళ్లు అని తెలియక ప్రవేశించాడు..
- నిందితుడు బంగ్లాదేశ్కి చెందిన వాడు..
- ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఇంట్లో దొంగతానికి వచ్చిన దుండగుడు సైఫ్పై దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ రోజు థానేలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని, అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిస్తున్నా అనే విషయం తెలియదని చెప్పారు. నిందితుడి ప్రధాన ఉద్దేశం దొంగతనం చేయడమని, దాడి చేయడం కాదని స్పష్టం చేశారు. ‘‘నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత ముంబైలో శాంతిభద్రతలు కుప్పకూలాయని కొందరు ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు. అయితే, వాస్తవాలు మరోలా కనిపిస్తున్నాయి. నిందితుడు బంగ్లాదేశ్ నుండి వచ్చాడు, మొదట కోల్కతాకు వచ్చి, ఆ తర్వాత ముంబైకి ప్రయాణించాడు. తాను దొంగతనం చేయబోతున్న ఇళ్లు సైఫ్ అలీ ఖాన్ది అని నిందితుడికి తెలియదు’’ అని అన్నారు.
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
Read Also: Trump Trip To India: భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తి.. సలహాదారులతో చర్చ..
జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు దాడి చేసిన ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ముంబై సురక్షితంగా లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ వంటి నేతలు మహాయుతి సర్కార్ని విమర్శించారు. దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఒక సంఘటన ఆధారంగా ముంబై సురక్షితంగా లేదనే ముద్ర వేయడం సరికాదని అన్నారు. మెగాసిటీలలో ముంబై అత్యంత సురక్షితమైనదని ఫడ్నవీస్ అన్నారు. నిందితుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ని ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసి బంద్రా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 5 రోజుల కస్టడీకి అప్పగించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ట్రంప్తో జిన్పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!