RSS Magazine: మోడీ చరిష్మా, హిందుత్వ మాత్రమే సరిపోవు.. బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Magazine: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్’ బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేసింది. గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ది ఆర్గనైజర్ బీజేపీ గెలుపోటముల గురించి ప్రస్తావిస్తూ సంపాదకీయం రాసింది. ఎన్నికల్లో గెలవడానికి మోడీ చరిష్మా, హిందుత్వ సరిపోదని స్పష్టం చేసింది.
ప్రాంతీయ స్థాయిలో బలమైన నాయకత్వం, సమర్థవంతమైన పనితీరు లేకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిష్మా, హిందుత్వ ఎన్నికల్లో గెలవడానికి సరపోదని ఆర్ఎస్ఎస్ అనుబంధ మ్యాగజైన్ ది ఆర్గనైజర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించింది. బీజేపీ పరిస్థితిని సమీక్షించడానికి ఇది సరైన సమయం అని చెప్పింది. రాష్ట్రస్థాయిలో పాలన ఉన్నప్పుడు సానుకూల అంశాలు, భావజాలం, నాయకత్వం బీజేపీకి నిజమైన ఆస్తులు అని ఆర్గనైజరన్ మే 23న ప్రఫుల్ల కేత్కర్ సంపాదకీయంలో పేర్కొంది.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: Tamilnadu: దళితుల ప్రవేశానికి నిరాకరణ.. ఒక గుడికి సీల్, మరో ఆలయం తాత్కాలికంగా మూసివేత
బొమ్మై ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను సూచిస్తూ, ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నా, దిగ్భ్రాంతిని కలిగించేవి కాదని పేర్కొంది. ప్రధాని మోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కర్ణాటక ఎన్నికల్లో మాత్రమే బీజేపీ అవినీతి ఆరోపణలను సమర్థించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తాయని సంపాదకీయం పేర్కొంది.
జాతీయ స్థాయి నాయకత్వ పాత్ర తక్కువగా ఉన్నప్పుడు, స్థానిక స్థాయిలో ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్నికల్లో బాగా పనిచేస్తుందని ఆర్గనైజర్ సూచించింది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తన శక్తిని అంతా నిలిపి పోరాడింది. అయితే కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీలో విజయం సాధించింది. 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో 135 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. కేవలం 66 స్థానాలకు బీజేపీ పరిమితం అయింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!