Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్.. పాక్ నుంచి ఏకే-47..
- సల్మాన్ ఖాన్ హత్యకు అతిపెద్ద కుట్ర..
- రూ. 25 లక్షలకు కాంట్రాక్ట్.. పాక్ నుంచి ఆయుధాలు..
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఒప్పందం..
- పోలీసుల ఛార్జిషీట్లో సంచలన విషయాలు..
Salman Khan: మహారాష్ట్రలోని పన్వెల్లోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్లో అతడిని హత్య చేసేందుకు రూ.25 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు నవీ ముంబై పోలీసులు గురువారం దాఖలు చేసిన ఛార్జిషీట్ పేర్కొంది. ఐదుగురు వ్యక్తులు, జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ముఠా ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నట్లు వెల్లడించింది. నిందితులు పాకిస్తాన్ నుంచి అత్యాధునియ ఆయుధాలైన ఏకే-47, ఏకే-92, ఏమ్-16 వంటి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు పంజాబీ సింగర్ సిద్దూమూసేవాలాను చంపేందుకు వాడిన జిగానా అనే ఆయుధాన్ని కూడా కొనాలనుకున్నారని ఛార్జిషీట్ పేర్కొంది.
నిందితులు సల్మాన్ ఖాన్ని హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు అబ్బాయిలను నియమించుకున్నారని, వీరింతా పూణే, రాయ్గఢ్, నవీ ముంబై, థానే, గుజరాత్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలిపింది. దాదాపుగా 60-70 మంది సల్మాన్ ఖాన్ కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా ఇంటిని, పన్వెల్లోని ఫామ్హౌజ్ని, గోరేగావ్ లోని సల్మాన్ ఖాన్ని ట్రాక్ చేసినట్లు ఛార్జిషీట్ పేర్కొంది. సల్మాన్ఖాన్ని చంపడానికి ఆగస్టు 2023- ఏప్రిల్ 2024 మధ్య ప్లాన్ జరిగింది.
Also Read
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
Read Also: Rajnikanth : “వెట్టయన్ ది హంటర్”కి ప్రీక్వెల్ చేయాలని ఉంది : టి.జె. జ్ఞానవేల్
గురువారం హర్యానాలోని పానిపట్లో అరెస్ట్ అయిన సుఖా, కుట్రలో పాల్గొన్న షూటర్ అజయ్ కశ్యప్ అలియాస్ ఏకేతో పాటు మరో నలుగురికి హత్యను కేటాయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సల్మాన్ ఖాన్కి గట్టి భద్రత, బుల్లెట్ ఫ్రూవ్ వాహనం కారణంగా హత్యకు అత్యాధునిక ఆయుధాలు అవసరమవుతాయని కశ్యప్, అతని టీం ఓ నిర్ణయానికి వచ్చింది. దీంతో సుఖా ఆయుధాల కోసం పాకిస్తాన్కి చెందిన ఆయుధ వ్యాపారి డోగర్ని సంప్రదించాడు. డోగర్ ఆయుధాలను సరఫరా చేయడానికి అంగీకరించగా, సుఖా 50 శాతం అడ్వాన్ ఇచ్చి, మిగతాది భారతదేశంలో డెలవరీ చేయడానికి అంగీకరించాడు.
షూటర్లు అంతా కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తు్న్నారని పోలీసులు కనుగొన్నారు. సల్మాన్ ఖాన్ని చంపేసిన తర్వాత నిందితులంతా కన్యాకుమారి వెళ్లి, అక్కడ నుంచి శ్రీలంకకు అక్కడ నుంచి భారతీయ నిఘా సంస్థలు చేరలేని దేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారని ఛార్జిషీట్ పేర్కొంది. బాంద్రాలో సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిగిన తర్వాత, పన్వెల్ ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..
-
Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!