Mumbai Airport: ముంబై ఎయిర్పోర్ట్లో రూ.1.49 కోట్ల వజ్రాలు సీజ్.. ఒకరి అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Airport: బంగారానికి, వజ్రాలకు చాలా విలువ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కేటుగాళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. విదేశాల నుంచి భారత దేశానికి తీసుకువచ్చి అమ్ముకోవడం లేదా.. ఇండియా నుంచి తీసుకెళ్లి విదేశాల్లో అమ్ముకోవడం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇలా చేస్తున్న కేటుగాళ్లల్లో కొందరు విమానాశ్రయాల్లో అధికారులకు పట్టుబడుతుంటారు. అలాంటి ఘటనే దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో జరిగింది. ముంబయి విమానాశ్రయంలో భారీగా వజ్రాలను పట్టుకున్నారు. రూ. 1.49 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వజ్రాలను విదేశాలకు తరలించడానికి ప్రయత్నించి ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వజ్రాలను డీ ఫౌడర్లో కలిపి తరలించేందుకు ప్రయత్నించి నిందితుడు. వజ్రాలతో దుబాయ్కి వెళుతున్న ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు.
Read also: Snake Farming: ఆ ఊర్లో పాములే అట్రాక్షన్.. కోట్లు సంపాదిస్తూ కోటలు కట్టేస్తున్నారు
Also Read
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళుతున్న ఒక భారతీయుడిని అరెస్టు చేసి .. అతని వద్ద నుంచి రూ. 1.49 కోట్ల విలువైన 1559.6 క్యారెట్ల సహజసిద్ధమైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రాలను విదేశాలకు తరలించే ప్రయత్నం చేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వజ్రాలను టీ ప్యాకెట్లో చాకచక్యంగా దాచి ఉంచారని కస్టమ్స్ అధికారులు తెలిపారు.ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అంతకుముందు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ విమానం వెనుక టాయిలెట్ నుండి సుమారు రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లెయిమ్ చేయని రెండు బ్యాగుల్లో బంగారం పేస్ట్ రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 1,709 గ్రాములు ఉంటుందని అధికారులు తెలిపారు. “ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది నుండి అందిన సమాచారం ఆధారంగా, AUH నుండి విమానం 6E 1404 వెనుక టాయిలెట్ నుండి రెండు క్లెయిమ్ చేయని బ్యాగుల్లో బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నట్టు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. రికవరీకి సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!