Mumbai Airport: ముంబై ఎయిర్పోర్ట్లో రూ.1.49 కోట్ల వజ్రాలు సీజ్.. ఒకరి అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Airport: బంగారానికి, వజ్రాలకు చాలా విలువ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కేటుగాళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. విదేశాల నుంచి భారత దేశానికి తీసుకువచ్చి అమ్ముకోవడం లేదా.. ఇండియా నుంచి తీసుకెళ్లి విదేశాల్లో అమ్ముకోవడం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇలా చేస్తున్న కేటుగాళ్లల్లో కొందరు విమానాశ్రయాల్లో అధికారులకు పట్టుబడుతుంటారు. అలాంటి ఘటనే దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో జరిగింది. ముంబయి విమానాశ్రయంలో భారీగా వజ్రాలను పట్టుకున్నారు. రూ. 1.49 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వజ్రాలను విదేశాలకు తరలించడానికి ప్రయత్నించి ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వజ్రాలను డీ ఫౌడర్లో కలిపి తరలించేందుకు ప్రయత్నించి నిందితుడు. వజ్రాలతో దుబాయ్కి వెళుతున్న ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు.
Read also: Snake Farming: ఆ ఊర్లో పాములే అట్రాక్షన్.. కోట్లు సంపాదిస్తూ కోటలు కట్టేస్తున్నారు
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళుతున్న ఒక భారతీయుడిని అరెస్టు చేసి .. అతని వద్ద నుంచి రూ. 1.49 కోట్ల విలువైన 1559.6 క్యారెట్ల సహజసిద్ధమైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రాలను విదేశాలకు తరలించే ప్రయత్నం చేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వజ్రాలను టీ ప్యాకెట్లో చాకచక్యంగా దాచి ఉంచారని కస్టమ్స్ అధికారులు తెలిపారు.ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అంతకుముందు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ విమానం వెనుక టాయిలెట్ నుండి సుమారు రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లెయిమ్ చేయని రెండు బ్యాగుల్లో బంగారం పేస్ట్ రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 1,709 గ్రాములు ఉంటుందని అధికారులు తెలిపారు. “ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది నుండి అందిన సమాచారం ఆధారంగా, AUH నుండి విమానం 6E 1404 వెనుక టాయిలెట్ నుండి రెండు క్లెయిమ్ చేయని బ్యాగుల్లో బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నట్టు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. రికవరీకి సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..