Mumbai Airport: ముంబై ఎయిర్పోర్ట్లో రూ.1.49 కోట్ల వజ్రాలు సీజ్.. ఒకరి అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Airport: బంగారానికి, వజ్రాలకు చాలా విలువ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కేటుగాళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. విదేశాల నుంచి భారత దేశానికి తీసుకువచ్చి అమ్ముకోవడం లేదా.. ఇండియా నుంచి తీసుకెళ్లి విదేశాల్లో అమ్ముకోవడం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇలా చేస్తున్న కేటుగాళ్లల్లో కొందరు విమానాశ్రయాల్లో అధికారులకు పట్టుబడుతుంటారు. అలాంటి ఘటనే దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో జరిగింది. ముంబయి విమానాశ్రయంలో భారీగా వజ్రాలను పట్టుకున్నారు. రూ. 1.49 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వజ్రాలను విదేశాలకు తరలించడానికి ప్రయత్నించి ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వజ్రాలను డీ ఫౌడర్లో కలిపి తరలించేందుకు ప్రయత్నించి నిందితుడు. వజ్రాలతో దుబాయ్కి వెళుతున్న ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు.
Read also: Snake Farming: ఆ ఊర్లో పాములే అట్రాక్షన్.. కోట్లు సంపాదిస్తూ కోటలు కట్టేస్తున్నారు
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళుతున్న ఒక భారతీయుడిని అరెస్టు చేసి .. అతని వద్ద నుంచి రూ. 1.49 కోట్ల విలువైన 1559.6 క్యారెట్ల సహజసిద్ధమైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రాలను విదేశాలకు తరలించే ప్రయత్నం చేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వజ్రాలను టీ ప్యాకెట్లో చాకచక్యంగా దాచి ఉంచారని కస్టమ్స్ అధికారులు తెలిపారు.ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అంతకుముందు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ విమానం వెనుక టాయిలెట్ నుండి సుమారు రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లెయిమ్ చేయని రెండు బ్యాగుల్లో బంగారం పేస్ట్ రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 1,709 గ్రాములు ఉంటుందని అధికారులు తెలిపారు. “ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది నుండి అందిన సమాచారం ఆధారంగా, AUH నుండి విమానం 6E 1404 వెనుక టాయిలెట్ నుండి రెండు క్లెయిమ్ చేయని బ్యాగుల్లో బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నట్టు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. రికవరీకి సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!