JioMart Layoff 2023: ఇక జియోమార్ట్ వంతు.. 1000మందిని తీసేసిన కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioMart Layoff 2023: ప్రతిరోజూ ఏదో ఒక పెద్ద కంపెనీ పెద్ద ఎత్తున లేఆఫ్లు ఉంటాయని ప్రకటిస్తూనే ఉంది, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్లైన్ హోల్సేల్ ప్లాట్ఫామ్ జియోమార్ట్ నుండి వెయ్యి మందికి పైగా వ్యక్తులను తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఇటీవలే మెట్రో క్యాష్ అండ్ క్యారీని కొనుగోలు చేసింది. దీంతో వాటి కార్యకలాపాలపై కంపెనీ దృష్టి సారించిందని తెలుస్తోంది. కంపెనీ తన కార్పొరేట్ కార్యాలయంలోని 1,000 మంది ఎగ్జిక్యూటివ్లలో 500 మందికి పైగా గత కొన్ని రోజుల కిందటే రాజీనామా చేయవలసిందిగా కోరింది. రానున్న వారాల్లో మరో 9,900 మంది ఉద్యోగులను తొలగించనుంది. కంపెనీ ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను పనితీరు మెరుగుదల ప్రణాళిక(Performance Improvement Plan)లో ఉంచిందని ఒక అధికారి తెలిపారు. అంతే కాకుండా ఇతర సేల్స్ ఉద్యోగులను వేరియబుల్ పే స్ట్రక్చర్పై ఉంచారు.
Read Also:Chetna Pande : బీచ్ ఒడ్డున అందాల సునామి సృష్టిస్తున్న చేతన పాండే
Also Read
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 15,000 మందిలో మూడింట రెండు వంతుల మేర తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తుంది. రాబోయే కొద్ది వారాల్లో కోతలు అమలులోకి రానున్నాయి. కంపెనీ తన 150కి పైగా ఆడియో ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లలో సగానికి పైగా మూసివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. స్థానిక స్టోర్లకు ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాల నుంచే ఉత్పత్తులను సరఫరా చేస్తుంటుంది. రిలయన్స్ రిటైల్ ఇటీవలే 344 మిలియన్ డాలర్లతో మెట్రో ఏజీ హోల్ సేల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. తాజా సంస్కరణల వెనుక ఇది కూడా ఒక కారణమేనని తెలుస్తోంది. మెట్రో ఏజీ కార్యకలాపాలను రిలయన్స్ రిటైల్ తో అనుసంధానించే క్రమంలో అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగించడం కూడా ఇందులో భాగంగా ఉంది. జియోమార్ట్లో ఉపసంహరణ కౌంట్ డౌన్ ప్రారంభమైందని.. పెద్ద ఎత్తున తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టమవుతుంది. జియోమార్ట్ మాత్రమే కాకుండా టెక్ సెక్టార్లో లేఆఫ్ గురించి మాట్లాడినట్లయితే, కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లోనే 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ ఏడాది ముగియడానికి ఇంకా ఏడు నెలల సమయం ఉంది, అటువంటి పరిస్థితిలో ఇంకెంతమంది ఉద్యోగాలు కోల్పోతారో చూడాలి.
Read Also:Kaleshwaram Project : ప్యాకేజీ-9లోని మొదటి పంపు ట్రయల్ రన్ విజయవంతం
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!