No-confidence Motion: రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ప్రారంభించనున్న రాహాల్ గాంధీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No-confidence Motion: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు పార్లమెంటులో చర్చ జరగనుంది. చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్తోపాటు .. బీఆర్ఎస్ కూడా మోడీపై అవిశ్వాసం కోసం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మోడీపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై 8, 9, 10 తేదిల్లో చర్చించడానికి గతంలోనే స్పీకర్ తేదిలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది.
Read also: Chiranjeevi: ఏంటి.. బాసూ.. దిల్ రాజునూ అలా ఆడేసుకున్నావ్
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
మోడీ ఇంటిపేరు కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నాలుగు నెలల క్రితం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల జైలుశిక్షని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో ఆగస్టు 4, 2023న సుప్రీంకోర్ట్ స్టే విధించింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియేట్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి పార్లమెంట్ సెక్రటేరియేట్ సమాచారం అందించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం తిరిగి తన పార్లమెంటు సభ్యత్వాన్ని పొందారు. పార్లమెంటు సభ్యత్వం తిరిగి రావడంతో.. రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంటుకు హాజరయ్యారు. మంగళవారంనాడు జరిగే అవిశ్వాస తీర్మానం చర్చలో రాహుల్ కీలకం కానున్నారు. మణిపూర్లోని హింసాత్మక ప్రాంతాలను రాహుల్ సందర్శించడం కూడా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో ఉపయుక్తంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!