ప్రపంచంలో పరిస్థితి వేగంగా మారుతోందని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని మార్షల్ ఆర్ట్స్తో రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఇది పట్టుతో మొదలై ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నారు. మనం యుద్ధం యుగంలోకి ప్రవేశించామని చెప్పుకొచ్చారు. గాజా-ఇజ్రాయెల్ యుద్ధ విషయంలో ఇది స్పష్టంగా కనిపించిందన్నారు. నేడు డేటా గొప్ప సంపద.. ఏఐకి ఇంధనం అన్నారు.
ఏఐ ప్రమాదకరమని ప్రపంచాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. భారతదేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజలు కొత్త సవాల్ను ఎదుర్కొంటున్నారన్నారు. బడ్జెట్లో ముఖ్యమైన విషయాలకు కేటాయింపులే లేవని చెప్పారు. డేటాకు సంబంధించింది ఏమీలేదన్నారు.
