Rahul Gandhi: జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో వివాదానికి కారణమయ్యారు. భారతదేశాన్ని అస్థిరపరచాలని భావించే జార్జ్ సోరోస్ సన్నిహితురాలు ప్రొఫఎసర్ డాక్టర్ కార్నెలియా వోల్ను కలిశారు. సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీలను ప్రస్తావిస్తూ బీజేపీ కాంగ్రెస్ నేతపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారతదేశాన్ని అపఖ్యాతీ పాలు చేస్తున్నారని బీజేపీ నేత గౌరవ్ భాటియా శనివారం ఆరోపించారు. రాహుల్ గాంధీ విదేశాల్లో భారత వ్యతిరేక శక్తులతో కలుస్తున్నారని, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Bangladesh Violence: బంగ్లాదేశ్లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ ఎవరు?
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారని, ఆయన అక్కడ హెర్టీ స్కూల్కు వెళ్లి ప్రొఫెసర్ కార్నెలియా వోల్ను కలిశారని, ఇది ఆయన ఎజెండా, ఉద్దేశాలను లేవనెత్తుతోందని భాటియా అన్నారు. రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్ రెండు శరీరాలు ఒకే ఆత్మ అని, ఇది మరోసారి రుజువైందని అన్నారు. రాహుల్ గాంధీ భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం ఇది మొదటిసారి కాదని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారత శత్రువులను, భారత్ అంటే గిట్టని వాళ్లను కలుస్తారని, ఇది ఎలాంటి ఎజెండా.? భారత ప్రతిపక్ష నేత అలాంటి శక్తులతో కలుస్తూ దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడా? అని ఆయన ప్రశ్నించారు.
కార్నెలియా వోల్ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ (CEU) యొక్క ట్రస్టీల బోర్డు సభ్యురాలు, ఇది జార్జ్ సోరోస్ స్థాపించిన సంస్థ, అతని ఓపెన్ సొసైటీ నెట్వర్క్తో దగ్గరి సంబంధం కలిగి ఉంది. సోరోస్ CEU ట్రస్టీల బోర్డు గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు, అతని కుమారుడు అలెగ్జాండర్ సోరోస్ కూడా బోర్డు సభ్యుడు. బోర్డులోని అనేక మంది ట్రస్టీలు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లతో ముడిపడి ఉన్నారు, ఇది యూనివర్సిటీ పాలన నిర్మాణంలో సోరోస్ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.
#WATCH | Delhi | BJP leader Gaurav Bhatia says, "The Leader of the Opposition, whose primary responsibility was to be in Parliament when the session was underway, but he goes to foreign soil…At the Hertie School in Germany, he meets Cornelia Woll…Rahul Gandhi and George Soros… pic.twitter.com/LD4ELxI6lb
— ANI (@ANI) December 20, 2025
