Site icon NTV Telugu

లాక్ డౌన్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు 

దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.  అయితే, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరుగుతున్నది.  సర్వేలు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నాయి.  ఈ సమయంలో లాక్ డౌన్ పై రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  కేంద్ర ప్రభుత్వం అనుసరించిన  విధానాల వలనే దేశంలో కరోనా మహమ్మారి కంట్రోల్ కావడం లేదని, వేంటనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయాలని అన్నారు.  

Exit mobile version