Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజుకో విషయం తెరపైకి వస్తోంది. మొన్నటికి మొన్న తాజ్ మహల్ కంటే ముందు అక్కడ శివాలయం ఉండేదని, ఆ శివాలయం స్థానంలో తాజ్ మహల్ నిర్మించారని అంటున్నారు. ఓ వాదన తెరపైకి వచ్చింది. అంతేకాకుండా దీనిపై హై కోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే పవిత్ర పుణ్య క్షేత్రమైన కాశీ క్షేత్రంలోని ఓ జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో హిందు ఆలయాల శిథిలాలు కనిపిస్తున్నాయని.. రోజు వారి పూజలకు అనుమతించాలంటూ అక్కడి మహిళలు కోర్టుకెక్కారు.
దీంతో కమిషనర్తో కూడి ఓ బృందాన్ని మసీదు దగ్గరు కోర్టు పంపగా.. జ్ఞానవాపి మసీదులోని బావిలో భారీ శివలింగం బయట పడింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం మారింది. ప్రస్తుతం జ్ఞానవాపి మసీదులో గురించి అందరూ చర్చించుకుంటున్న సమయంలో.. ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. ఢిల్లీలోని అరుదైన ఈ పురాతన కట్టడమైన కుతుబ్ మినార్ను కట్టించింది రాజా విక్రమాదిత్య అంటూ పురావస్తు పరిశోధన శాఖ మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్ వీర్ శర్మ ప్రకటన చేశారు. దీన్ని కట్టించింది కుతుబ్ ఆల్ దిన్ ఐబక్ కాదన్నది ఆయన వాదన. సూర్యుడి గమనాన్ని అధ్యయనం చేసేందుకు రాజు విక్రమాదిత్య దీన్ని కట్టించినట్టు ఆయన పేర్కొంటున్నారు.
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
‘‘ఇది కుతుబ్ మినార్ కాదు. సన్ టవర్ (పరిశీలించే గోపురం). 5వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య దీన్ని కట్టించాడు. కుతుబ్ ఆల్ దిన్ ఐబక్ కాదు. ఇందుకు సంబంధించి నా వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయి’’ అని ధరమ్ వీర్ శర్మ ప్రకటన చేశారు. పురావస్తు శాఖ తరఫున శర్మ కుతుబ్ మినార్ ను ఎన్నో పర్యాయాలు సర్వే చేయడం గమనార్హం.
‘‘కుతుబ్ మినార్ టవర్లో 25 అంగుళాల వంపు ఉంటుంది. ఎందుకంటే సూర్యుడిని పరిశీలించేందుకు ఇలా నిర్మించారు. అందుకే జూన్ 21న సూర్య ఆయనంలో (ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి మారే క్రమం) కనీసం అరగంట పాటు ఆ ప్రాంతంపై నీడ పడదు. ఇది సైన్స్. పురాతన వాస్తవం’’ అని తన వాదనకు నేపథ్యాన్ని శర్మ వివరించారు. కుతుబ్ మినార్ అన్నది స్వతంత్ర కట్టడమని, సమీపంలోని మసీదుకు సంబంధించినది కాదని శర్మ పేర్కొన్నారు. కుతుబ్ మినార్ డోర్ కూడా ఉత్తర ముఖంగా ఉంటుందని, రాత్రి వేళ ధ్రువ నక్షత్రాన్ని చూసేందుకేనని శర్మ వివరించారు.
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?