Nepal Floods: నేపాల్లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. భాటేకోషి నది ఉప్పొంగడంతో నేపాల్ ఉత్తరాన ప్రాంతం అతలాకుతలమైంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికే మరణాల సంఖ్య 500లను దాటింది. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, మరోసారి హిమాలయాల్లో ఏర్పడిన సరస్సు బద్ధలయ్యే అవకాశం ఉందని చైనా హెచ్చరిస్తోంది.
ఇదిలా ఉంటే, ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి, ఇళ్లు, భవనాలు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో ఒక ఇళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. చుట్టు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది, ఇంటిని చుట్టుముట్టిన నీరు, నీటిలో తేలుతున్న వాహనాలు ఇంటిని ఢీకొట్టినా చెక్కు చెదరలేదు. అందులో ఉన్న కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇప్పుడు ఈ ఇంటి నాణ్యతపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వీడియో వైరల్ అయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న కుటుంబం సురక్షితంగా ఉందా? అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఒక యూజర్ ఈ ఇంటిని నిర్మించిన వ్యక్తికి ‘‘నేపాల్ రత్న’’ అవార్డ్ ఇవ్వాలని సరదాగా వ్యాఖ్యానించాడు. గత తరాల నిర్మాణ నైపుణ్యానికి ఇది నిదర్శమని ప్రశంసించారు.
That family in the green house. I hope they are alive and safe. 🙏🏻 what a nightmare. pic.twitter.com/t2tVR2cFD7
— Pooja Shali (@PoojaShali) August 28, 2026

