IAS Puja khedkar: మరో కొత్త వివాదంలో పూజా.. దొంగను వదిలిపెట్టాలంటూ ఏం చేసిందంటే..!
- మరో కొత్త వివాదంలో ట్రైనీ ఐఏఎస్ పూజా
- దొంగను వదిలిపెట్టాలంటూ పోలీసులకు ఫోన్లో ఒత్తిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తవ్వేకొద్దీ ఆమె బండారం బయటడుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. వేటు వేయించుకున్న ఆమె.. కొత్త కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటోంది. ఇప్పటికే కంటి చూపు, మానసిక వైకల్యంతో పాటు ఓబీసీ సర్టిఫికెట్ విషయంలో నకిలీలు సృష్టించి ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా నవీ ముంబై పోలీసులు.. మహారాష్ట్ర హోంశాఖకు కీలక రిపోర్టును అందజేశారు. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యుడ్ని విడుదల చేయాలంటూ పోలీసులపై పూజా ఖేద్కర్ తీవ్ర ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం. పూజా.. మే 18న డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్కి ఫోన్ చేసి… దొంగిలించబడిన స్టీల్ను రవాణా చేస్తున్నాడని అనుమానిస్తున్న వ్యక్తిని విడిచిపెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఈశ్వర్ అనే వ్యక్తి నిర్దోషి అని.. అతనిపై వచ్చిన అభియోగాలు చాలా చిన్నవిని ఆమె చెప్పుకొచ్చింది. కానీ పోలీసులు మాత్రం దొంగను విడిచిపెట్టలేదు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
2023 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ పూణె జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్గా నియమితులయ్యారు. ట్రైనీగా ఉంటూ గొంతెమ్మ కోర్కెలు కోరింది. దీంతో ఆమెపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు వెళ్లడంతో పూజా కుటుంబ సభ్యుల ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక ఆమె తల్లి మనోరమా.. అయితే ఒక రైతును తుపాకీతో బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అలాగే పూజా వాడిన కారుకి 21 ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు పెండింగ్లో ఉన్నాయని కూడా తేలింది. 27,000 జరిమానా చెల్లించాలని పోలీసులు నోటీసు జారీ చేశారు. ఇక అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ఆయన కార్యాలయాన్ని కూడా ఆమె ఉపయోగించారు. ఇక ఆమెపై ఆరోపణలు నిజమని తేలితే ఉద్యోగం పోయే పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా క్రిమినల్ కేసులు ఎదుర్కొనే దుస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!