Site icon NTV Telugu

Jharkhand: ప్రిన్సిపాల్‌ అరాచ‌కం.. 7మంది మైన‌ర్ బాలిక‌ల‌ను..

Harassment

Harassment

విద్యాబుద్దులు చెప్పించే మాస్టారే త‌ప్పటడుగు వేస్తే.. విద్యార్థుల‌కు మంచి చ‌దువు చెప్పి మంచి న‌డ‌వ‌డిక‌ను నేప్పించే ఉపాధ్యాయుడే కామ‌వాంఛ‌కు లోనైతే.. విద్యార్థుల‌కు క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకోవాల్సిన ఆ గురువే ఓ విద్యార్థిని ప‌ట్ల అసభ్యంగా ప్ర‌వర్తించ‌డ‌మే కాకుండా ఆ మైన‌ర్ బాలిక‌లను వేధించ‌డం మొద‌లు పెట్టాడు. చిన్న పిల్ల‌ల‌కు తండ్రిగా తోడై వుండి.. విద్యాభ్యాసం నేప్పించాల్సింది పోయి. అభం శుభం తెలియ‌ని ఆ మైన‌ర్ బాలిక‌పై క‌న్నువేశాడు ఆ.. కామాంధుడు. కొద్దిరోజులు న‌ర‌క యాత‌న అనుభ‌వించిన ఆ చిన్నారులు ఆ కీచ‌క ఉపాధ్యాయుడి గురించి చివ‌ర‌కు పోలీసుల‌కు ఆశ్ర‌యించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కామాంధుని భ‌ర‌తం ప‌ట్టారు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్ లో చోటుచేసుకుంది.

జార్ఖండ్‌లోని ఛాయ్‌బాసా పోలీస్‌ స్టేషన్‌ కు 7గురు మంది విద్యార్థులు రావడం కలకలం రేగింది. వారు చదువుకుంటున్న పాఠశాల ప్రిన్సిపల్ వారిని వేధిస్తున్నాడని ఆ గురు చిన్నారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారంతో ఓ ప్రవేట్ పాఠశాలలోని అదే స్కూల్ లో వుంటున్నామని దాన్ని అలుసుగా చేసుకుని రోజు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, మాటి మాటికి తన క్యాబిన్ కి పిలవడం..వారిని నరయాతనకు గురిచేస్తున్నాడని అతని పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రిన్సిపాల్ భరతం పట్టారు. నిందితున్ని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించామని జార్ఖండ్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Corona: దేశంలో కొత్తగా 12,899 కేసులు, 15 మరణాలు

Exit mobile version