President’s flag: ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ అంటే ఏంటి?. రేపు తమిళనాడు పోలీసులకు ఇవ్వనున్న వెంకయ్యనాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President’s flag: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రేపు ఆదివారం (జూలై 31న) తమిళనాడు పోలీసులకు ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ను అందజేయనున్నారు. ఈ కార్యక్రమం చెన్నైలోని రాజారత్నం స్టేడియంలో జరగనుంది. ఇందులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ అంటే ఏంటనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ని ప్రెసిడెంట్స్ కలర్ అవార్డ్ అని కూడా అంటారు. దీన్నే ‘నిషాన్’గానూ పేర్కొంటారు. ఇదో అరుదైన చిహ్నం/బ్యాడ్జ్/ఫ్లాగ్/ఎంబ్లం/మార్క్/కలర్.
ఈ ప్రత్యేక పురస్కారం వరించటాన్ని అత్యున్నత గౌరవంగా భావిస్తారు. దేశానికి అత్యుత్తమ సేవలందించిన బలగాలకు ఇస్తుంటారు. ఇది.. మిలటరీ లేదా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత పోలీసులు ధరించే ఒక డెకరేషన్. తొలిసారిగా 1951లో ఈ అవార్డును ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల పోలీసు విభాగాలకు ఈ పురస్కారాన్ని బహూకరించారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. దీనికి అర్హత సాధించాలంటే కనీసం పాతికేళ్లపాటు సేవలందించి ఉండాలి. ఈ అవార్డును గతంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, కేంద్రమంత్రి అందించారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
Top-3: టాప్-3 కంపెనీలు.. టాప్-3 సంపన్న మహిళలు..
తమిళనాడుకు 2009లోనే పురస్కారాన్ని ప్రకటించారు. కానీ ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి బహుకరించలేదు. ఈ వేడుక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. గతంలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఇవ్వాలనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. మొన్న 22వ తేదీన కూడా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి చేతుల మీదుగా అందించాలని భావించారు. ఎట్టకేలకు రేపు ఆదివారం ఈ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఫ్లాగ్ని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఉపరాష్ట్రపతి నుంచి స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర పోలీస్ విభాగంలో మొత్తం లక్షా 31 వేల 491 మంది పోలీసులు ఉన్నారు.
ఐపీఎస్ ఆఫీసర్ మొదలుకొని కానిస్టేబుల్ వరకు ప్రతిఒక్కరూ ఈ ఫ్లాగ్ని తమ యూనిఫాంలో భాగంగా ధరిస్తారు. ఈ మేరకు ప్రత్యేక యూనిఫాంని రూపొందించారు. ఈ అవార్డును చివరిసారిగా గతేడాది అస్సాం పోలీసులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా బహూకరించారు. రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ తరఫున ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు తొలిసారిగా 2019లో గుజరాత్ పోలీసులకు ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ను అందజేశారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకి ప్రత్యేక ప్రెసిడెంట్స్ కలర్ బ్యాడ్జ్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!