Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్ అంత్యక్రియలు గురువారం లక్నోలోని బైకుంఠ ధామ్లో ముగిశాయి. ఆయన అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అల్లుడి చితికి నిప్పంటించిన మామ..
సాధారణంగా కొడుకులు లేదా సోదరులు అంత్యక్రియలు నిర్వహిస్తారు, కానీ ఇక్కడ ఒక అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. అపర్ణా యాదవ్ తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ సింగ్ బిష్ట్ తన అల్లుడు ప్రతీక్ యాదవ్ చితికి నిప్పంటించారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. అఖిలేష్ యాదవ్తో సహా కుటుంబ సభ్యులందరూ ఈ కడసారి వీడ్కోలులో పాల్గొన్నారు. అంత్యక్రియల సమయంలో ప్రతీక్ యాదవ్ కుమార్తెలు ప్రథమ, ప్రతీక్షలను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. పెద్ద కుమార్తె ప్రథమ చాలా సేపు అఖిలేష్ యాదవ్ పక్కనే కూర్చొని కన్నీరుమున్నీరైంది. అపర్ణా యాదవ్ భర్త మరణవార్త విన్న సమయంలో ఆమె అస్సాంలో ఉన్నారు. వెంటనే ఆమె లక్నో చేరుకోగా, అఖిలేష్ యాదవ్ ఆమెను పరామర్శించి మాట్లాడారు.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
ప్రతీక్ యాదవ్కు జంతువులంటే అమితమైన ఇష్టం. ఆయన అంతిమయాత్రలో శవపేటికను పువ్వులతో అలంకరించడమే కాకుండా, ఆయన పెంపుడు కుక్కలతో ఉన్న ఫోటోలను కూడా ఉంచారు. వందలాది మంది ప్రజలు, రాజకీయ నేతలు ఈ అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకు కడసారి వీల్కోలు పలికారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్వయంగా వారి నివాసానికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించారు.
అసలేం జరిగిందంటే..
పలు నివేదికల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పనిమనిషి ప్రతీక్ యాదవ్ను గదిలో అపస్మారక స్థితిలో ఉండటం గమనించారు. వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిజానికి ప్రతీక్ యాదవ్ గత కొంతకాలంగా ‘పల్మనరీ ఎంబోలిజం’ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మే మొదటి వారంలో ఆయనకు కాలికి శస్త్రచికిత్స జరిగింది. గతంలో మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నప్పటికీ, తాజాగా ఆయన అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాజ్వాదీ పార్టీ, బీజేపీకి చెందిన పలువురు నేతలు ప్రతీక్ యాదవ్ మృతికి సంతాపం ప్రకటించారు.
తాజావార్తలు
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్తో మన జీవితాలే మారిపోవచ్చు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!