Prateek Yadav Death: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ మరణం ఉత్తర్ ప్రదేశ్ను షాక్కు గురిచేసింది. 38 ఏళ్ల వయసులో ప్రతీక్ మరణించారు. ఆయన మరణానికి ప్రధాన కారణం ‘‘పల్మనరీ థ్రోంబోఎంబోలిజం’’ అని డాక్టర్లు చెప్పారు. ఉపరితిత్తుల్లోని ఒక సిరలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె, ఊపిరితిత్తులు అకాస్మత్తుగా పనిచేయడం ఆగిపోయి, శరీర వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయి. దీంతోనే మరణం సంభవించినట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది.
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రతీక్ యాదవ్ శరీరంపై మొత్తం ఆరు గాయాలను గుర్తించారు. ఛాతీ భాగం, కుడి చేయి, మోచేతి, ఎడమ మణికట్టు ప్రాంతాల్లో ఈ గాయాలు ఉన్నట్లు రిపోర్టు చెప్పింది. వీటిలో కొన్ని 5-7 రోజలు పాతగా తేలింది. మరికొన్ని మరణానికి ఒక రోజు ముందు జరిగినట్లు వైద్యులు తెలిపారు.
Read Also: CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
తమ దర్యాప్తును ధ్రువీకరించుకోవడానికి వైద్యులు కెమికల్, హిస్టోపాథలాజికల్ పరీక్షల కోసం అంతర్గత అవయవాలు, గుండెను భద్రపరిచారు. ఏదైనా విషం, ఇతర రసాయన ఆనవాళ్లు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి అంతర్గత అవయవాలను పరీక్ష కోసం పంపించనున్నారు. నివేదిక వస్తే మరణానికి మరింత ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు.
పోస్టుమార్టం నివేదిక సమయంలో పాత గాయాలుగా భావిస్తున్న కమిలిన గుర్తుల్ని కనుగొన్నారు. మరణానికి కారణంగా గుండెపోటుగా నిర్ధారించబడింది. అనారోగ్యం కారణంగా ప్రతీక్ ఎడమ కాలి బొటన వేటు నీలి రంగులోకి మారింది. ప్రతీక్ యాదవ్ లివర్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ముందు నుంచే ఉన్నట్లు సమచారం. ఆయన పలుమార్లు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రి తీసుకువచ్చే సమయానికే చనిపోయి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
