Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ స్మారకంపై కేంద్రం కీలక నిర్ణయం..
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం కోసం భూమి కేటాయింపు..
- కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన శర్మిష్ట ముఖర్జీ..
- ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన ప్రణబ్ కూతురు..
Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాజ్ఘాట్ కాంప్లెక్స్లోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో భూమిని కేటాయించింది. తన తండ్రి స్మారకం కోసం భూమిని కేటాయించినందుకు ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆమె పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (ఎల్అండ్డిఓ) భూమి కేటాయించిన లేఖను ఆమె షేర్ చేశారు.
కేటాయించిన స్థలం రాజ్ఘాట్ రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్లో భాగంగా ఉంటుంది. ‘‘ మేము స్మారకం కోసం అడగలేదు. పీఎం చేసిన ఈ పని చాలా విలువైనంది. రాష్ట్ర గౌరవాలను అడగకూడదు, వాటిని అందించాలని బాబా చెప్పేవారు. బాబా స్మృతిని గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు’’ అని శర్మిష్ట చెప్పింది.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Read Also: Nara Lokesh: జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలి..
ఐదు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ప్రణబ్ ముఖర్జీ 2012 నుండి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. కాంగ్రెస్ నేతగా ఉన్న ఆయన 2009 నుండి 2012 వరకు ఆర్థిక మంత్రితో సహా కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2019లో దేశ అత్యున్నత పురస్కారం ‘‘భారతరత్న’’ని అందించారు. 2020 ఆగస్టులో ప్రణబ్ ముఖర్జీ మరణించారు.
శర్మిష్ట ముఖర్జీ పలు సందర్భాల్లో తన తండ్రిని కాంగ్రెస్ గౌరవించలేదని విమర్శించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ, సంతాప తీర్మానాన్ని ఆమోదించడానికి అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి కాకముందు 45 ఏళ్ల పాటు కాంగ్రెస్ నేతగా పనిచేశారని.. 30 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీతో అనుబంధం ఉందని ఆమె అన్నారు. సోనియా గాంధీ వ్యక్తిగత సంతాప లేఖని పంపగా, సీడబ్ల్యూసీ కనీసం సంతాప తీర్మానం చేయలేదని ఆమె అన్నారు. రాష్ట్రపతిగా పనిచేసిన కేఆర్ నారాయణన్కు సంతాప సభ నిర్వహించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!