Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి
- కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అదనంగా విద్యాశాఖ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో తన శాఖలను నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషి.. ఇకపై కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు.
నీట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన నిరసనలు గత కొన్ని వారాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో విడుదల చేసిన లేఖలో.. దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Also Read
తన రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘జంతర్మంతర్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకోకూడదు. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. భారతదేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు.’’ అని పేర్కొన్నారు. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గౌరవ ప్రధాని మోడీకి తన రాజీనామాను సమర్పించినట్లు వెల్లడించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించే వరకు ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
నీట్ పరీక్షల వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడం, పేపర్ లీకేజీలపై కఠిన చట్టం తీసుకురావడం, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి చర్యలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు ప్రహ్లాద్ జోషికి అప్పగించడంతో ఆ సంస్కరణల అమలు ఆయన పర్యవేక్షణలో కొనసాగనుంది.
తాజావార్తలు
-
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
-
Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్న్యూస్తో పాటు బ్యాడ్న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
-
Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
-
Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
-
KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!