Site icon NTV Telugu

Meloni-Modi: మరోసారి ట్రెండింగ్లోకి మెలోడీ మూమెంట్..

Melody

Melody

Meloni-Modi: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పలు దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోడీ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతిక అంశాల్లో సహకారం గురించి చర్చించామని భారత ప్రధాని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టును పెట్టారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగైన ప్రపంచానికి దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. భారత్‌, ఇటలీ ప్రధానులు మోడీ, జార్జియా మెలోనీ మధ్య స్నేహం కూడా కొనసాగుతుంది. అది వారు దిగే ఫోటోల్లో కనపడుతుంది. ఇక, మెలోడీ (మెలోనీ+మోడీ) పేరిట ఆ పిక్చర్స్ పలుమార్లు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. తాజాగా జీ20 వేదికగా ఈ మెలోడీ మూమెంట్‌ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Read Also: Rajanna Sircilla: రేపు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

అయితే, జీ20 సదస్సులో పాల్గొన్న పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆయన్ను హస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పరాగ్వే ప్రథమ మహిళ లెటీసియా ఒకాంపోస్‌ వెల్లడించారు. వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు.


https://twitter.com/rajasthaniman1/status/1858741459895414803

Exit mobile version