Site icon NTV Telugu

PM Modi: శనివారం 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ

Vandebharatexpresstrain Tom

Vandebharatexpresstrain Tom

ప్రధాని మోడీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి కావడం విశేషం. కొత్త రైళ్లు తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్, మదురై-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి. చెన్నై సెంట్రల్, మదురై జంక్షన్ స్టేషన్లలో వేడుక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడో రైలు.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్- లక్నో మధ్య నడవనుంది.

ఇది కూడా చదవండి: Nandamuri Balakrishnal: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అందరికీ ఆహ్వానం

చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ బుధవారం మినహా ఆరు రోజులు నడుస్తుంది. మదురై-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఆరు రోజుల పాటు నడుస్తుంది. దక్షిణ రైల్వే జోన్‌లో నడవనున్న మూడు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు.

చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20627/20628) రైలు బుధవారాలు మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. చెన్నై ఎగ్మోర్, తాంబరం, విల్లుపురం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మదురై, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి మరియు నాగర్‌కోయిల్ జంక్షన్‌లలో రైలు ఆగుతుంది. రైలు చెన్నై ఎగ్మోర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో నాగర్‌కోయిల్‌లో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. చైర్ కార్ ధర రూ. 1,760 కాగా… ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,240. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఈ ధర ఉందనుంది.

ఇది కూడా చదవండి: Chirag Paswan: ప్రధాని మోడీ నుంచి నన్ను విడదీయలేరు..

ఇదిలా ఉండగా మదురై-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20671/20672) రైలు సర్వీస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు కూడా నడుస్తుంది. ఇది దిండిగల్, తిరుచ్చిరాపల్లి, కరూర్, నమక్కల్, సేలం మరియు కృష్ణరాజపురంలలో ఆగుతుంది. దక్షిణ రైల్వే షెడ్యూల్ ప్రకారం.. రైలు మదురై జంక్షన్ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరిగి ప్రయాణంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.45 గంటలకు మధురై చేరుకుంటుంది. ఒక చైర్ కార్ ధర రూ. 1,575, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2,865. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఉండనుంది.

ఇది కూడా చదవండి: Shera: 1.4 కోట్లతో రేంజ్ రోవర్ కారు కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్… జీతం ఎంతో తెలుసా?

Exit mobile version