Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..

  • నేపాల్ ప్రధాని బాలెన్ షాకు ప్రధాని మోడీ ఫోన్..
  • వరదలపై సాయం అందిస్తామని హామీ..
  • నేపాల్ వరదలతో బీహార్, యూపీలు హై అలర్ట్..
Pm Modi

Pm Modi

Nepal Floods: నేపాల్‌లో భోటేకోశి నది పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన మెరుపు వరద నేపాల్‌లోనే ఊర్లకుఊర్లను కబలించింది. వందలాది మంది గల్లంతయ్యారు. 100కు పైగా భారతీయులు కూడా గల్లంతైనట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, భారత్‌లో కూడా వరద ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీహార్, యూపీల్లో కోసి, గండక్ నదుల్లో ప్రవాహాలు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

ఇదిలా ఉంటే, నేపాల్ వరద విధ్వంసంపై ఆ దేశ ప్రధాని బాలెన్ షాకు, భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. నేపాల్‌లో వరదల కారణంగా జరిగిన ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపారు. నేపాల్‌కు సాధ్యమైనంత మానవతా సహాయం, సహాయక మద్దతు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత్ కాఠ్మాండులో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

నేపాల్‌లో వరదల వల్ల జరిగిన విధ్వంసం ఆందోళనకరంగా ఉందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గండక్, నారాయణి నదులలో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున, మహారాజ్‌గంజ్, కుషినగర్‌లోని స్థానిక యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అధికారులను ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. బీహార్‌లోని ఆరు జిల్లాలకు పలు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పంపారు. కోసి, గండక్ నదీ పరివాహక ప్రాంతాలలో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.