PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- ఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం
- రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ ప్రత్యేక భేటీ
- ఇంధన సంక్షోభంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం కీలక దౌత్య సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు.

Also Read
- Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈ భేటీల్లో చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే బ్రిక్స్ సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రులు, ప్రతినిధులతో కలిసి మోడీ అధికారిక ‘‘బ్రిక్స్ ఫ్యామిలీ ఫొటో’’లో కూడా పాల్గొన్నారు. సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ఎస్.జైశంకర్ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం భారత్ మండపంలోకి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్కు స్వాగతం పలికారు. సభ్య దేశాలు, పరిశీలక దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులను కూడా ఆయన ఆహ్వానించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్లో ఉండటంతో.. ఆయన స్థానంలో భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహోంగ్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా, ఇథియోపియా ప్రతినిధి గిడియాన్ తిమోతీ హెస్సన్లకు జైశంకర్ స్వాగతం పలికారు. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఖలీఫా షహీన్ అల్ మరార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రపంచ, ప్రాంతీయ అంశాలు, ఆర్థిక సహకారం, బహుపాక్షిక సంస్కరణలు, వాణిజ్యం, అభివృద్ధి సవాళ్లపై చర్చించేందుకు బ్రిక్స్ వేదికగా నిలుస్తోంది. 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ను భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మే 14 నుంచి 15 వరకు జరగనున్న ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రెజిల్ నుంచి ఈ ఏడాది జనవరి 1న భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. గతంలో 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ బ్రిక్స్ సదస్సులకు ఆతిథ్యం ఇచ్చింది.
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!