PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- ఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం
- రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ ప్రత్యేక భేటీ
- ఇంధన సంక్షోభంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం కీలక దౌత్య సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు.

Also Read
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్షీట్
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈ భేటీల్లో చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే బ్రిక్స్ సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రులు, ప్రతినిధులతో కలిసి మోడీ అధికారిక ‘‘బ్రిక్స్ ఫ్యామిలీ ఫొటో’’లో కూడా పాల్గొన్నారు. సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ఎస్.జైశంకర్ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం భారత్ మండపంలోకి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్కు స్వాగతం పలికారు. సభ్య దేశాలు, పరిశీలక దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులను కూడా ఆయన ఆహ్వానించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్లో ఉండటంతో.. ఆయన స్థానంలో భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహోంగ్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా, ఇథియోపియా ప్రతినిధి గిడియాన్ తిమోతీ హెస్సన్లకు జైశంకర్ స్వాగతం పలికారు. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఖలీఫా షహీన్ అల్ మరార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రపంచ, ప్రాంతీయ అంశాలు, ఆర్థిక సహకారం, బహుపాక్షిక సంస్కరణలు, వాణిజ్యం, అభివృద్ధి సవాళ్లపై చర్చించేందుకు బ్రిక్స్ వేదికగా నిలుస్తోంది. 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ను భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మే 14 నుంచి 15 వరకు జరగనున్న ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రెజిల్ నుంచి ఈ ఏడాది జనవరి 1న భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. గతంలో 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ బ్రిక్స్ సదస్సులకు ఆతిథ్యం ఇచ్చింది.
తాజావార్తలు
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!