PM Modi: తమిళనాడులో ప్రధాని మోడీ ‘‘పొంగల్’’ వేడుకలు.. ఎన్నికల ముందు కీలక పరిణామం..
- తమిళనాడులో ప్రధాని ‘‘పొంగల్’’ వేడుకలు..
- రైతులతో కలిసి సెలబ్రేషన్స్..
- ఎన్నికల ముందు కీలక రాజకీయ పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈసారి తమిళనాడులో ‘‘పొంగల్’’ పండగ వేడుకలు జరుపుకునే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన పర్యటించే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలో రైతులతో కలిసి పొంగల్ జరుపుకోనున్నారు. 2026తో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ పర్యటన కీలకంగా మారే అవకాశం ఉంది. ఇది గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు సాంస్కృతిక ఏకీకరణను పెంపొందించే ప్రయత్నంగా చూస్తున్నారు.
పంటల పండగగా పిలిచే ‘‘పొంగల్’’ వేడుకల్ని తమిళనాడులో ప్రధాని మోడీ జరుపుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. గ్రామీణ తమిళనాడుతో బీజేపీ సంబంధాలను బలపరచడం, తమిళ సంస్కృతి, గుర్తింపుపై తన ప్రాధాన్యతను నొక్కి చెప్పడాన్ని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం, తమిళనాడు-కాశీ మధ్య నాగరికత, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి కాశీ తమిళ సంగమం 4.0 ముంగిపు వేడుకలకు ప్రధాని రామేశ్వరం వెళ్లే అవకాశం ఉంది. వీటిలో పాటు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలో పుదుక్కోటలో జరగనున్న రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమం ‘తమిళగం తలై నిమిర తమిళనిన్ పయనం’ ముగింపు కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది.
Also Read
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
Read Also: Kerala: కేరళలో లోకల్ పోల్స్లో బీజేపీ సంచలనం.. “రాజధాని” కైవసం..
ఎన్నికలకు ముందే ప్రధాని పర్యటనతో తమిళనాడులో ఎన్డీయే ఒక రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉందని, పలు ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరవచ్చని తెలుస్తోంది. రాబోయే తమిళనాడు ఎన్నికల కోసం వ్యూహాలు, సమన్వయం, కార్యచరణ ఖరారు చేయడానికి మోడీ ఎన్డీయే నాయకులతో సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం, తమిళనాడులో ఎన్డీయేను మరింత బలపరచడానికి పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే), దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే), అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) , బహిష్కృత ఏఐఏడీఎంకే నాయకుడు ఓ. పన్నీర్సెల్వంతో సహా పలు పార్టీలతో చర్చలు జరుపుతోంది. ప్రధాని పర్యటనకు ముందే ఈ పొత్తు చర్చలు ముగియాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన వీకే శశికళతో కూడా ఎన్డీయే చర్చలు జరుపుతోంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
-
RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..