PM Modi: బీజేపీ ప్రభుత్వాల అభివృద్ధిని ఇతరుల పాలనతో పోల్చొద్దు
- బీజేపీ ప్రభుత్వాల అభివృద్ధిని ఇతరుల పాలనతో పోల్చొద్దు
- కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన
- ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్లో పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ఇతర పార్టీల పాలనతో పోల్చవద్దని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఖజురహోలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని తెలిపారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధి కొత్త రూపు సంతరించుకుందన్నారు. రూ.వేల కోట్ల విలువైన కార్యక్రమాలు మొదలయ్యాయని తెలిపారు. నేడు కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిందని చెప్పారు. దేశాభివృద్ధిలో వాజ్పేయ్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సుశాసన్ దినోత్సవం ప్రభుత్వానికి ఒక్కరోజు కార్యక్రమం కాదని.. అది తమ గుర్తింపు అని పేర్కొన్నారు.
దేశ ప్రజలు హ్యాట్రిక్గా కేంద్రంలో ఎన్డీయే సర్కారును ఎన్నుకున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని మేధావులు కొన్ని ప్రమాణాలను తీసుకుని.. కాంగ్రెస్, లెఫ్ట్, కుటుంబ, సంకీర్ణ పార్టీల పాలనలో ఏం పనులు జరిగాయి..? బీజేపీ ఉన్న చోట్ల అభివృద్ధి ఎలా జరిగిందో విశ్లేషించాలని కోరారు. బీజేపీ ప్రజల కోసం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఎంత వరకు చేరాయి అన్నదే ప్రామాణికం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అభివృద్ధి ప్రకటనల హడావుడికే పరిమితం అయిందని ధ్వజమెత్తారు.
Also Read
కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 గ్రామాలకు చెందిన దాదాపు 7.18 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. రైతులకు సాగునీరు పుష్కలంగా అందడంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరు అందుతుంది. ఈ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడంతో పాటు టూరిజం కూడా అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ప్రాజెక్ట్ కింద పన్నా టైగర్ రిజర్వ్లోని కెన్ నదిపై 77 మీటర్ల ఎత్తు మరియు 2.13 కిలోమీటర్ల పొడవు గల దౌధన్ ఆనకట్ట, రెండు సొరంగాలు నిర్మించనున్నారు.
#WATCH | Khajuraho, Madhya Pradesh | Prime Minister Narendra Modi says "Congress governments ruled the country for a long time. Congress considers government as its birthright but has always been against governance…Congress never thought about solving the water crisis…After… pic.twitter.com/Qo7U1UE16a
— ANI (@ANI) December 25, 2024
తాజావార్తలు
-
Ghost SIM Scam: ‘ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
-
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!