చమురు, గ్యాస్పై ఆందోళన అక్కర్లేదని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంపై లోక్సభలో మోడీ మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా కొనసాగుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 3,75,000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పటివరకు ఇరాన్ నుంచి దాదాపు 1,000 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు. వీరిలో 700 మందికి పైగా వైద్య విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా గల్ఫ్ దేశాల్లోని పాఠశాలల్లో 10, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. విద్యార్థుల విద్యకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. హార్ముజ్ జలసంధి ద్వారా భారీ పరిమాణంలో ముడి చమురు, గ్యాస్, ఎరువులు, అనేక నిత్యావసర వస్తువులు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలసంధి గుండా రవాణా అత్యంత సవాలుగా మారింది. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగకుండా ఉండేందుకు మా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మనందరికీ తెలిసినట్లుగా దేశం ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. సరఫరాలో అనిశ్చితి కారణంగా ప్రభుత్వం దేశీయ ఎల్పీజీ వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చింది. అదనంగా దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచుతోంది. సరఫరాకు ఆటంకం లేకుండా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా కొనసాగుతోంది.’’ అని మోడీ అన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య
‘‘యుద్ధ ప్రభావిత దేశాల్లోని మన రాయబార కార్యాలయాలు భారతీయులకు నిరంతరం సహాయం అందిస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న భారతీయులైనా.. పర్యటిస్తున్న పర్యాటకులైనా.. అందరికీ సాధ్యమైనంత సహాయం అందిస్తున్నారు. రాయబార కార్యాలయాలు క్రమం తప్పకుండా సలహాలు జారీ చేస్తున్నాయి. భారతదేశంలో ఇతర ప్రభావిత దేశాల్లో 24 గంటల హెల్ప్లైన్లు, అత్యవసర హెల్ప్లైన్లు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ప్రభావిత ప్రజలందరికీ తాజా సమాచారం అందించబడుతోంది. సంక్షోభ సమయాల్లో భారతదేశంలో.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత అత్యంత ముఖ్యం.’’ అని అన్నారు.
‘‘యుద్ధ ప్రభావం దీర్ఘకాలం కొనసాగవచ్చు.. కరోనా సంక్షోభానికి సిద్ధంగా ఉన్నట్లే ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాల్సిందే. కోవిడ్-19 సంక్షోభానికి మనం ఎలా సిద్ధంగా ఉన్నామో.. అలాగే దీనికి కూడా సిద్ధంగా ఉండాలి. మనం సంసిద్ధంగా ఉండడమే కాకుండా ఐక్యంగా ఉండాలి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇలాంటి సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడూ ఎదుర్కొంటాం’’ అని తెలిపారు.
‘‘భారతదేశంలో భవిష్యత్తులో తలెత్తే చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొత్త దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాం. దీనికి ఇథనాల్ వంటివి తోడవ్వడం, రైల్వేల విద్యుదీకరణ, ఈవీలు, ప్రత్యామ్నాయ ఇంధనంపై చేసే కృషి సురక్షితమైన భవిష్యత్తును అందిస్తాయి. ప్రస్తుతం మనకు లభించే శక్తిలో సగం పునరుత్పాదక వనరుల నుంచే వస్తోంది. కొత్త వనరుల నుంచి 250 గిగావాట్ల విద్యుత్ వస్తోంది. 40 లక్షల రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. అణుశక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వార ఐదేళ్లలో 1500 మెగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యం పెరిగింది.’’ అని పేర్కొన్నారు.
‘‘ఈ సంక్షోభంపై భారత పార్లమెంట్ నుంచి ఒక ఏకగ్రీవ, సమైక్య స్వరం ప్రపంచానికి చేరడం అత్యవసరం. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి భారతీయుడికి అవసరమైన సహాయం అందించాం. నేను స్వయంగా రెండు విడతలుగా పశ్చిమ ఆసియా దేశాధినేతల్లో చాలా మందితో ఫోన్లో మాట్లాడాను. వారందరూ భారతీయుల భద్రతకు పూర్తి హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ కాలంలో కొందరు విషాదకరంగా మరణించారు, మరికొందరు గాయపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు సహాయం అందించబడుతోంది.’’ అని చెప్పారు.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "… Another major challenge of the war is that the summer season is beginning in India. In the coming days, with rising temperatures, the demand for electricity will increase. Currently, adequate coal stocks… pic.twitter.com/CC393Nivjj
— ANI (@ANI) March 23, 2026
On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "Because of such efforts, many of our ships that were stranded in the Strait of Hormuz have also arrived in India. Due to ethanol blending, we are saving the import of about 4.5 crore barrels of oil every year.… pic.twitter.com/MaURhm7jvC
— ANI (@ANI) March 23, 2026
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "… In the last 11 years, India has diversified its energy imports. Earlier, for energy needs like crude oil, LNG and LPG, imports were made from 27 countries, but today India imports energy from 41… pic.twitter.com/ElXZOR6b1C
— ANI (@ANI) March 23, 2026