Omar Abdullah: ప్రధాని మోడీపై వ్యక్తిగత దాడి మనల్నే దెబ్బతీస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలు ప్రతిపక్షాలకే ఎదురుదెబ్బగా మారుతున్నాయని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. భారతదేశం పేదగా మారితే, బీజేపీ ధనవంతమైందని ఆరోపించారు. శనివారం ఇండియా టుడే కాన్క్లేవ్ 2024లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై వ్యతిగత దాడికి దిగిన ప్రతీసారి అది బూమరాంగ్ అవుతోందని అన్నారు.
ప్రధానిపై వ్యకిగత దాడి పనిచేయదని, ఇది పలు సందర్భాల్లో రుజువైందని ఒమర్ అబ్దుల్లా అన్నారు. గత అనుభవాలు కూడా ఇదే చెబుతోందని.. ‘‘చౌకీదార్ చోర్ హై’’, ‘‘ అదానీ-అంబానీ’’ పనికిరావని చెబుతోందని, మీకు నచ్చినా, నచ్చకపోయినా ఇది వాస్తవమని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి వద్ద డబ్బు ఉందని మీరు కేసు పెట్టలేరు, ఎందుకంటే దానిని నిరూపించడానికి ఆధారాలు లేవని, కానీ భారతదేశంలో చాలా భాగం పేదగా మారితే, బీజేపీ రిచ్ అయిందని, 50 శాతం ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకే ఇవ్వబడ్డాయని ఆయన అన్నారు.
Also Read
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
Read Also: Telangana: హస్తం, కమలం పార్టీల మధ్యే పోటీ.. రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషీలు రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి వ్యూహాలపై చర్చించారు. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారత కూటమి పోటీ చేస్తుందని, గెలుస్తుందా..? లేదా..? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని సచిన్ పైలట్ అన్నారు. గత 9 ఏళ్లుగా దేశం చూసిన పరిస్థితుల కారణంగా ఇండియా కూటమి ముందుకు వచ్చిందని, దేశంలో సుస్థిరమైన రాజ్యాంగ సంస్థలపై ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతోందని, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎన్డీయేకు గట్టి పోటీ ఇవ్వడమే కూటమి లక్ష్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి, అంటే మూడింట రెండొంతులు మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారని ఆయన అన్నారు. ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ.. దేశం పెద్ద ప్రమాదంలో ఉందని అందుకే ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పారు.
తాజావార్తలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!