India-US Trade Deal: “త్వరలో శుభవార్త”.. ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్పై కేంద్రమంత్రి..
- ‘‘శుభవార్త వింటారు’’..
- యూఎస్ ట్రేడ్ డీల్పై కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US Trade Deal: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం న్యాయం, సమానంగా, సమతుల్యంగా జరిగిన తర్వాత మీరు తర్వాత శుభవార్త వింటారు అని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం అన్నారు. ఈ ఒప్పందం భారతదేశ రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇక్కడ నిర్వహించిన ఇండో-అమెరికా ఆర్థిక సదస్సులో ఆయన వెల్లడించారు.
‘‘ఒక దేశంగా భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవాలి. మన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవాలి. రైతులతో, మత్స్యకారులతో, చిన్న పరిశ్రమలతో మన సున్నితత్వాన్ని సమతుల్యం చేసుకోవాలి. రెండు దేశాలు సమాన పరిష్కారం కనుగొన్నప్పుడు మనకు ఫలితాలు లభిస్తాయి. ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా మారినప్పుడు, మీరు శుభవార్త వింటారు’’ అని గోయల్ అన్నారు.
Also Read
- Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
- El Nino Effect On Stock Market: ఎల్నినో ప్రభావం స్టాక్ మార్కెట్పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
- Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
Read Also: PM Modi: మోడీ ధరించిన “వాచ్”పైనే అందరి చూపు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా..
భారతదేశం, యూఎస్ మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 6 రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్నామని, ఇది చాలా ఏళ్ల ఒప్పందం కావచ్చని గోయల్ అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని, భాగస్వామ్యం నిరంతరం పెరుగుతుందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం సుంకం విధించిన తర్వాత, రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారాయి. రష్యా నుంచి భారత్ ఆయిలు కొనుగోలు చేస్తుందని టారిఫ్ విధించారు. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా బాదం, పిస్తా, ఆపిల్స్, ఇథనాలు, జన్యుపరంగా మార్పు చేసిన వస్తువులకు భారత మార్కెట్ యాక్సెస్ కోరుతోంది. 2024-25లో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది, ద్వైపాక్షిక వాణిజ్యం USD 131.84 బిలియన్లు (USD 86.5 బిలియన్ ఎగుమతులు)గా ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: వైభవ్కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
-
Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6s Gen 2 చిప్
-
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
-
Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
-
Trump-Pakistan: ట్రంప్తో పాకిస్థాన్కు కొత్త సంకటం.. సౌదీకి షరీఫ్, మునీర్!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!