India-US Trade Deal: “త్వరలో శుభవార్త”.. ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్పై కేంద్రమంత్రి..
- ‘‘శుభవార్త వింటారు’’..
- యూఎస్ ట్రేడ్ డీల్పై కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US Trade Deal: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం న్యాయం, సమానంగా, సమతుల్యంగా జరిగిన తర్వాత మీరు తర్వాత శుభవార్త వింటారు అని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం అన్నారు. ఈ ఒప్పందం భారతదేశ రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇక్కడ నిర్వహించిన ఇండో-అమెరికా ఆర్థిక సదస్సులో ఆయన వెల్లడించారు.
‘‘ఒక దేశంగా భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవాలి. మన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవాలి. రైతులతో, మత్స్యకారులతో, చిన్న పరిశ్రమలతో మన సున్నితత్వాన్ని సమతుల్యం చేసుకోవాలి. రెండు దేశాలు సమాన పరిష్కారం కనుగొన్నప్పుడు మనకు ఫలితాలు లభిస్తాయి. ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా మారినప్పుడు, మీరు శుభవార్త వింటారు’’ అని గోయల్ అన్నారు.
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: PM Modi: మోడీ ధరించిన “వాచ్”పైనే అందరి చూపు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా..
భారతదేశం, యూఎస్ మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 6 రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్నామని, ఇది చాలా ఏళ్ల ఒప్పందం కావచ్చని గోయల్ అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని, భాగస్వామ్యం నిరంతరం పెరుగుతుందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం సుంకం విధించిన తర్వాత, రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారాయి. రష్యా నుంచి భారత్ ఆయిలు కొనుగోలు చేస్తుందని టారిఫ్ విధించారు. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా బాదం, పిస్తా, ఆపిల్స్, ఇథనాలు, జన్యుపరంగా మార్పు చేసిన వస్తువులకు భారత మార్కెట్ యాక్సెస్ కోరుతోంది. 2024-25లో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది, ద్వైపాక్షిక వాణిజ్యం USD 131.84 బిలియన్లు (USD 86.5 బిలియన్ ఎగుమతులు)గా ఉంది.
తాజావార్తలు
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
-
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
-
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!